భారత మిలటరీ కాన్వాయ్పై కశ్మీర్లోని పుల్వామాలో దాడి జరిగిన రెండు రోజులకే ఈ దాడి ఘటన మరువక ముందే..పాక్ మిలటరీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. బలూచిస్తాన్ ఆత్మాహుతి దాడి తమ పనే అని బలూచ్ రజీ అజోయ్ సంగర్(BRAS) ప్రకటించుకుంది. పాక్లో సౌదీ రాజు పర్యటనకు కేవలం కొద్ది గంటల ముందు ఆ దేశ ఆర్మీ కాన్వాయ్పై దాడి జరగటం గమనార్హం.
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ సంస్థలు కలిసి ఏర్పడిన సంస్థ బలూచ్ రజీ అజోయ్ సంగర్(BRAS).పాక్ నుంచి బలూచ్ స్వాతంత్ర్యం కోసం ఈ సంస్థ పోరాడుతోంది.
కాగా, పుల్వామా దాడి తర్వాత పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఈ సంస్థ భారత్కు విజ్ఞప్తి కూడా చేసింది. పాక్తో అన్ని సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని భారత్ను కోరింది. భారత్, పాకిస్తాన్లలో జరిగిన ఈ ఘటనలతో ఉపఖండంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.