ఒక గ్రామదేవాలయ మంటపములో ఒక పండితుడు ఒక చక్కని సాయంత్రం హరికథా శ్రవణం వినిపిస్తున్నారు. అనేక మంది ఆయన అభిమాలతో పాటు ఆయన ధర్మపత్ని కూడా ఆలకించ టానికి వచ్చింది. దీనిబట్టి ఆయన ఎంతటి పండితుడో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు హరికథలో వంటచేసే ఆడవాళ్ళకు ఒక ఉపదేశమిచ్చారు. ఉల్లి, వెల్లి తోపాటు మసాలాలు వాడవడ్డని వాడితే పెద్దలకు ఆలోచనాశక్తి, పిల్లలకు నాలుక మందమై వాక్ - సామర్ధ్యం తగ్గిపోతాయని వివరించారు.

 

తరువాతి రోజు ఇంట్లో "హే వి టొయ్ ఈ రోజు వంటిలా తగలెట్టావ్?" భొజనం రుచించక పత్నితో అన్నారు? (ప్రశ్నిస్తే ఆడాళ్ళు తంతారు) దానికావిడ, నిన్న మీరే కదా ఉల్లి, వెల్లి, మసాలా లు వంటలో వాడరాదని భోదించారు కదా! అని బుగ్గలు నొక్కున్నారు. దానికా పండితులవారు కోపంగా (బయటికి చమత్కారంగా) “మీ మొహం సమావేశాల్లో సవాలక్ష ఉపదేశాలు చేస్తాం. అవి ఎదుటివాళ్ళకి. నేను ఉపన్యాసాల్లో చెప్పినవి నీవింట్లో చేసి నా కడుపు కొట్టకు”  అన్నారట. ఈ సొది ఎందు కంటే చంద్రబాబు వారి ఆంతర్య వివరణ కోసం.

 

నేరస్తుల సంరక్షణ: జగన్మోహనరెడ్డి అనేక కేసుల్లో ముద్దాయి. దర్యాప్తు సంస్థల ద్వారా న్యాయస్థానాల్లో కేసులు పరిశీలనలో ఉన్నాయి. వారు నిర్దారించేవరకు జగన్ నేరస్తుడని బల్లగుద్ది చెప్పలేం.  అందునా తను ప్రజలు ఎన్నికల్లో ఎన్నుకున్న ప్రజానాయకుడే. మెజారిటి సభ్యులుంటే  చంద్రబాబు స్థానాన్ని భర్తీ చేసే పరిస్థితి ఆయనది.  జాతకం బాగుండి పవన్ కల్యాణ్ లోని ‘తిక్క పుణ్యమా’  అని - మోడీ రాజకీయ ‘వ్యూహఫలితం’ గా ఆ సీట్లో చంద్రబాబు కూర్చున్నారు. అలాంటి వ్యక్తి పదేపదే జగన్ ని ధారుణంగా, అత్యంత అవమానకరంగా విమర్శించటం అభ్యంతరకరం. 

criminal tdp mps కోసం చిత్ర ఫలితం 

జగన్ ముద్దాయి మాత్రమే. మరి చంద్రబాబు రాజ్యసభకు ఎంపికచేసిన మహనీయ సుజానా చౌదరి గారు మారిషస్ కోర్టుల్లో నేరస్తులుగా నిర్ధారించ బడ్డవారు. అలాంటి విదేశాల్లోని నేరస్తుణ్ణి గతంలోనే రాజ్యసభకు పంపి టిడిపి మిత్రపక్షంలో కేంద్ర మంత్రిమండలిలో చేర్చారు. అప్పుడు చేస్తే ఓకె. తరవాత నేరస్తుడని తేలినప్పుడు రాజీనామా చేయించక పోవటం టిడిపి నేరమైతే, ఒక విదేశీ కోర్టులో నేరస్తుడైన వ్యక్తిని మంత్రిగా కొనసాగించటం కేంద్రానిది కూడా మహానేరం అవదా? దానికి మోడీ వద్ద బహు చక్కనైన సమాదానం ఉంటుంది. టిడిపి మా రాజకీయ మరియు ప్రభుత్వ భాగస్వామి. టిడిపి పంపిన కోరిన వ్యక్తిని మంత్రిని చేశాం. తప్పొప్పులకు వారే భాధ్యులు అనగలరు. అప్పుడే టిడిపి ఖెల్ ఖతం అవుతుంది. దాంతో పాటు రెండవసారి కూడా నామినేట్ చేసి రాజ్యసభకు ఆపై మంత్రిమండలికి పంపటం మహానేరం అవుతుంది.  అదే  పని  జగన్ చేస్తే వ్యభిచారం - బాబు చేస్తే సంసారం ఎలా అవుతుంది? ఆఫ్-కోర్స్ ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని సంకీర్ణం నుండి తెగదెంపులు చేసుకొని ఆర్నెల్లక్రితం బయటకు వచ్చిన చంద్రబాబు నేడు మోడీని విమర్శిస్తూ రోజూ తాను నిప్పు అంటూ సూక్తిముక్తావళి వినిపిస్తున్నాడు.

sujana cm ramesh కోసం చిత్ర ఫలితం
మరిప్పుడు జగన్ ని నేరస్తుడని "ధాటిగా నొక్కి వక్కాణించ గలరా!" చంద్రబాబు? ఒక వేలు మీరు చూపితే నాలు వ్రెళ్ళు మిమ్మల్ని చూపుతున్నాయ్? ఒక నాడు “సుజనాని రాజ్యసభకు పంపుటయా? జగన్ను ఇక నిందించుటయా?"  అనేది టిడిపికి నాడు రారాజుకి వచ్చిన "మనుటయా? మరణించుటయా?" అన్నంత కఠిన సమస్యగా అనిపించినా సిగ్గు విడిచేసి వ్యభిచారం చేసి బయటకి సంసారం అని కలరిచ్చారు.

 chandrababu lokesh కోసం చిత్ర ఫలితం

వారసత్వం గురించి: ఇక ఒకనాడు వారసత్వం గురించి ఇందిరాగాంధిని ధూషించిన టిడిపి మేధావులు, నేడు బాల విధురుడు రాజకీయ వ్యూహా ధురంధరుడు లోకేష్ ని టిడిపిలో బలవంతంగా దూర్చి మెధావిగా ప్రకటిస్తున్నారు కదా దీనినేమందాం? దీనికి సమాదానం చెప్పటానికి బాబుచంద్రుల వారి నాలుక మందం. అలాగే నాటి ముఖ్యమంత్రులు దిల్లీ చుట్టూ తిరగటాన్ని హేళన చేసిన బాబు జనులు, ఇప్పుడు చంద్రబాబు దిల్లి చూట్టూ 29సార్లు చక్కర్లు కొట్టినా మోడీ కరుణించలేదని - ఆయనే డిల్లీ చుట్టు తిరిగింది అంగీకరించినట్లే కదా!  చక్కర్లు కొట్టడాన్ని ఎలా సమర్ధించు కుంటారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సమాదానం చెప్పవలసిన కార్యకర్తలు కూడా ఇదే ప్రశ్నలు వేస్తున్నారు. మరి ఎవరు చెపుతారు సమాదానం?

TDP Vyabhichaaram కోసం చిత్ర ఫలితం 

టిడిపికి మహిళలంటే గౌరవం: ఇక టిడిపివాళ్ళకు మహిళంటే చాలాగౌరవమంటారు బాబుగారు. మహిళలపై  ఒక సినిమాసభలో చండాలంగా మాట్లాడిన బాబుగారి బామ్మర్ది,  వియ్యంకుడు, ఎన్.టి.ఆర్ వారసుడిపై ఎలాంటి చర్య మీరు తీసుకున్నారు.  ఎదుటివాళ్ళకు నీతులు. టిడిపి వాళ్ళకు విందు భోజనాలా? అంటున్నారు ప్రజలు. చింతమనేని లాంటి దుష్టచతుష్టయం మహిళలను హింసించిన విధానం గురించి ఇప్పటికే అనేకసార్లు చర్చకు వచ్చింది. 

TDP Vyabhichaaram కోసం చిత్ర ఫలితం 

పిరాయింపుల గురించి పిరాయింపుల సార్వభౌముడు: చంద్రబాబు  ఈ మద్య ఇస్తున్న పిలుపు ఆ పార్టీ లో కలవరం రేపుతోంది. చంద్రబాబు పిలుపును ప్రజలు బలపరిస్తే ప్రస్తుతం టీడీపీలో ఉన్న 23మంది ఫిరాయింపుదారులు ఇంటి బాట పట్టాల్సిందే. అందులో నలుగురు మంత్రులు కూడా ఉన్నారు. అవసరం లేకపోయినా కేవలం రాజకీయ కోణంలో ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. దీనిపై పెద్దఎత్తున విమర్శ లు వచ్చినా, ఏకంగా ప్రతిపక్షం ఇదే కారణంతో ఏడాదిన్నరకుపైగా అసెంబ్లీ సమావేశా లను బహిష్కరించినా ఆయన లెక్క చేయలేదు. ఇప్పుడు టీడీపీ నుంచి కొంతమంది నేతలు తమపదవులకు రాజీనామాచేసి వైసీపీలో చేరటంతో చంద్రబాబులో కలవరం మొదలైంది.


అందుకే  ఉండబట్టలేక తమ దగ్గర చాలామంది అలాంటివాళ్ళే ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి  ఫిరాయింపు దారులను ఓడించాలని చంద్రబాబు  ప్రజలకు పిలుపు నిస్తున్నారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని కూడా చంద్రబాబు తన హయాంలో కొత్త పీక్ లకు తీసుకెళ్లారు. ఎలా అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవటమే కాకుండా,సొంత పార్టీ నేతలను కాదని ఏకంగా నలుగురు ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చి మరీ ఫిరాయింపుదారులకే ఆదర్శంగా నిలిచారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారటం పిరాయింపు అయితే చంద్రబాబు ఇంకా వాటిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కానీ ఆయన దగ్గర నుంచి ఎవరు వెళ్లినా సరే వాళ్లు మాత్రమే అవకాశవాదులు పదవుల కోసం వెళ్ళిపోయారని చెప్పటం ఒక్క టీడీపీ నేతలకే చెల్లింది.


పోలవరం జాతికి కలవరం: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యంత కీలకమైన ‘పోలవరం’ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు తీవ్ర విమర్శలపాలు అవుతోంది. ‘రాజకీయం’ కోసం చంద్రబాబు ఈ ప్రాజెక్టుతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో చంద్రబాబుకు  విభేదాలు ఉండొచ్చు. 

polavaram project images కోసం చిత్ర ఫలితం

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం అంచనాలను ఏపీ ప్రభుత్వం ఎలా పెంచుతుంది? కేంద్రం ఆమోదం లేకుండా ఇష్టానుసారం పెంచితే ఆ డబ్బులు కేంద్రం ఇస్తుందా? ఇవ్వక పోతే పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మొదటి నుంచి పోలవరం అంచనాలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య తేడాలు ఉన్నాయి. అస్మదీయ కాంట్రాక్టర్లకు వేలకోట్ల రూపాయలు పనులు అప్పగించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ సమయంలో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రాజెక్టును ప్రమాదంలో పడేయటం ఖాయం అని చెబుతున్నారు. oka వైపు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ బహిరంగ సభలో పోలవరం అంశాన్ని ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం 2010–11 ధరల మేరకు ₹16010 కోట్లు ఉండగా, ఇప్పుడు ఏకంగా ₹55549 కోట్లకు పెంచుతూ సాగునీటి శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ జీవో 21ని జారీ చేశారు.


పోలవరం అంచనాలకు సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం కార్యదర్శి యు.పి.సింగ్‌ నేతృత్వంలో సాంకేతిక సలహా కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా సెలవు రోజైనప్పటికీ ఆదివారం అంచనా వ్యయాన్ని పెంచేస్తూ జీవో 21జారీ చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్రప్రభుత్వం 2017 ఆగస్టులో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ₹57940 కోట్లకు పెంచుతూ, ఇందుకు ఆమోదం తెలపాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

polavaram project images కోసం చిత్ర ఫలితం

అప్పటి నుంచి ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. oka వైపు ఢిల్లీలో సమావేశం ఉన్న ఒక్క రోజు ముందు జీవో జారీ చేయటం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఈ పని  చేశారని చెబుతున్నారు.  కేంద్రం కాదంటే మళ్ళీ సహజంగా మోడీపై దాడి మొదలు పెట్టవచ్చు. దాన్ని ఈ ఎన్నికలకు మరింత శక్తివంతంగా వాడుకోవచ్చు. అదే అసలు ప్లాన్ కావచ్చొని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


కాంట్రాక్టులేమో బాబు కులజనాలకు గారికి - కేసులు మాత్రం మోడీ బృందానికి: పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఇందులో ఎవరికీ అనుమానం లేదు. కానీ కాంట్రాక్ట్ లు  మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూసుకుంటారంట. రాష్ట్రాల మధ్య ఏమైనా కేసులు తలెత్తితే ప్రధాని నరేంద్ర మోడీ చూసుకోవాలట. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారం. కేంద్రం ఎప్పుడో 2015లోనే పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు  చేసినా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఎ) ముందస్తు అనుమతి తోనే చేయాలని విస్పష్టంగా లేఖ రాయగా, దాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారం సబ్-కాంట్రాక్ట్ లు ఇచ్చి, కొత్తగా అస్మదీయ  కాంట్రాక్టర్లను తెచ్చుకునేందుకు సిద్ధమైన అయిన చంద్రబాబుకు ఇప్పుడు మాత్రం పోలవరం జాతీయ ప్రాజెక్టు అని గుర్తొచ్చిందన్న మాట.

contractors in TDP Government కోసం చిత్ర ఫలితం

చంద్రబాబు అమరావతిలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులోనే పోలవరం అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఒరిస్సా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు రాసిన లేఖపై అధికారులు చంద్రబాబుకు వివరించగా, పోలవరం నిర్మాణంలో ఇదో కొత్త పరిణామం అని వ్యాఖ్యానించారు. సీఎంలు మాట్లాడుకోవాలని ఒరిస్సా కోరుతుందని అధికారులు తెలపగా, పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీదే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పటికే తాను ఒరిస్సా సీఎంతో మాట్లాడానని, రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం. చత్తీస్ఘడ్ సీఎంకు పరిస్థితి వివరించాక ఆయన ప్రస్తుతం ఏమీ  మాట్లాడటం లేదన్నారు.


కొద్ది రోజుల క్రితం కేంద్ర కొత్తగా పిలిచిన టెండర్లను పక్కన పెట్టాలని లేఖ రాయగా, దీనిపై నానా యాగీ చేసిన సీఎం చంద్రబాబు ఒరిస్సా అభ్యంతరాలపై ప్రధానే సమావేశం ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానిస్తున్నారు. అదే కేంద్రం రాసిన లేఖపై నరేంద్ర మోడీని తప్పుపట్టిన చంద్రబాబు, ఇప్పుడు మాత్రం మోడీ వైపు చూడటం విశేషం. నిజానికి పోలవరంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించాల్సింది కేంద్రమే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ చంద్రబాబు తనకు నచ్చినట్లు చేస్తూ, వీలును బట్టి ఒక్కో అంశంలో ఒక్కో స్టాండ్ తీసుకోవటమే సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు.


అపర మాహిష్మతి అంతర్జాతీయస్థాయి రాజధాని అమరావతి:  అమరావతి. ప్రపంచశ్రేణి రాజధాని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం చెప్పేమాటలు. కానీ అది ఇప్పటి వరకూ ‘గ్రామస్థాయి’ని  దాటలేదు.  ప్రభుత్వం కోర్ క్యాపిటల్ ఏరియాను అయినా కార్పొరేషన్ గానో, మునిసిపాలిటీ గానో ప్రకటిస్తే తప్ప, అక్కడ అభివృద్ధి సాధ్యంకాదని చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఇఫ్పటికీ పల్లె వాతావరణమే కన్పిస్తుంది తప్ప, అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఒక ట్రెండు విద్యాసంస్థలు మాత్రం వేగంగా తమ భవనాలను పూర్తి చేస్తున్నాయి.


గ్రామకంఠాల విషయాన్ని కూడా ప్రభుత్వం ఇంతవరకూ ఏమీ తేల్చలేదు. ఇది ఎప్పటికి తేలుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి. దీంతో పాటు అసైన్మెంట్ భూములు, వాగు, పోరంబోకు భూములకు సంబంధించి కూడా పలువివాదాలు ఉన్నాయని స్థానిక రైతులు చెబుతున్నారు. భూములు ఇఛ్చిన రైతులకు సర్కారు ఫ్లాట్ల కేటాయింపు చేస్తున్నా, ఏక్కడ ఏది ఉందో తెలియక పోవటంతో రైతులు తమకు ఈ విషయంలో మరింత స్పష్టత ఇస్తే తప్ప తాము వాటిని తీసుకోమని చెబుతున్నారు.

amaravati present కోసం చిత్ర ఫలితం

భూములు తీసుకుని మూడేళ్లు కావస్తున్నా ఇంత వరకూ రాజధాని ప్రాంతంలో నిర్మాణరంగ కార్యకలాపాలు ఏమాత్రం ఊపందుకోక పోవటంతో అసలు అభివృద్ధి జరగటం లేదని, ప్రైవేట్ డెవలపర్లు రాకుండా అభివృద్ధి సాధ్యం కాదని చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం కేవలం తమకు కావాల్సిన చోట రహదారులు వేసుకుని మిగతా ప్రాంతాలను విస్మరిస్తుందని రైతులు భావిస్తున్నారు.


ఒకవైపు రాజధాని పనులతో పాటు, ప్రైవేట్ సంస్థలు నిర్మాణాలు ప్రారంభిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి సాధ్యం అవుతుందని, ఇది ఎప్పుడు మొదలవుతుందో తెలియని వాతావరణం ఉంద ని భూములిచ్చిన రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల నుంచి మాటలు తప్ప, పనులులేవని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పరిధిలో ఉన్నా అవి ఇంకా గ్రామస్థాయిని దాటి ముందుకు రాలేదు. తమ స్థలాన్ని పెట్టుకుని ఋణం తీసుకుని భవనాలు కట్టుకుందామంటే వాటిని గ్రామాలు గానే బ్యాంకులు పరిగణిస్తుండటం పెద్ద ఇబ్బందిగా మారిందని రైతులు చెబుతున్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతసేపు సింగపూర్, జపాన్, ఇస్తాంబుల్ అంటారే తప్ప, అసలు 34వేల ఎకరాల ప్రాంతంలో ఇప్పటివరకూ అసలు నిర్మాణ కార్యకలాపాలు ఊఫందుకోక పోవటం ప్రగతికి పెద్ద ప్రతిబంధకంగా మారిందని చెబుతున్నారు.


ఏ అరాచకానికైనా మోదీ సమర్థుడే! నాలుగున్నరేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు స్వప్రయోజనాల కోసం ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాతి నాటి నుంచి ప్రధాని మోదీని, బీజేపీని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ పుల్వామా దాడికి ప్రధాని మోదీయే కారణమనే అర్థం వచ్చేలా విమర్శల దాడికి దిగారు. మంగళవారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ రాజకీయ లబ్దికోసం దేశాన్ని తాకట్టుపెడితే సహించేది లేదంటూ చంద్రబాబు హెచ్చరించారు. దేశభక్తి, భద్రతలో టీడీపీ రాజీపడదు అని వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రిగా, భారతదేశ పౌరుడిగా ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన పనిలేదు.

chandrababu on Narendra modi కోసం చిత్ర ఫలితం

అయితే ‘ప్రధాని నరేంద్ర మోదీ ఏ అరాచకానికైనా సమర్థుడే. గోద్రాలో రెండు వేల మందిని బలితీసుకున్న నరమేధాన్ని మరువలేము. ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆయనను అనుమతించ లేదు. విదేశాలు కూడా మోదీని బాయ్‌కాట్‌ చేశాయి. బీజేపీ రాజకీయాలతోనే జమ్ము కశ్మీర్‌లో సంక్షోభం ఏర్పడింది. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అస్థిరత ప్రమాదకరం. సరిహద్దు రాష్ట్రా ల్లో రాజకీయ లబ్ది చూడరాదు’ అంటూ బాబు మాట్లాడటం చూస్తుంటే, ఆయన మాటల్లో దేశభక్తిని నిరూపించుకునే ప్రయత్నం కంటే కూడా, నరేంద్ర మోదీపై బురద జల్లే ప్రయత్నానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టమవుతోంది.


నరేంద్ర మోదీతో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం పంచుకున్న నాడు గోద్రా విషయం చంద్రబాబుకు గుర్తురాకపోవడం గమనార్హం. అదే విధంగా సరిహద్దు రాష్ట్రాల్లో రాజకీయ లబ్ది చూడరాదని ఆయనే చెప్పారు. అంటే మిగతా రాష్ట్రాల్లో తన లాగే రాజకీయ లబ్ది కోసం ఏమైనా చేయవచ్చని చంద్రబాబు భావిస్తున్నారా అనేది అర్థంకాని విషయం. ఎన్డీయేలో ఉన్నంతవరకు ఆయనకు నరేంద్ర మోదీ విజన్‌ ఉన్న నాయకుడిలా కనిపించారు.. విభేదాలు వచ్చిన నాటి నుంచే నరేంద్ర మోదీ తనకంటే జూనియర్‌ అనే విషయం ఆయనకు గుర్తుకు వచ్చింది. అయితే అది ఏ విషయంలోనో మనకు స్పష్టంగా తెలియదు.

TDP Vyabhichaaram  కోసం చిత్ర ఫలితం

అయినా తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు, ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి కృషిని చూసి బెంబేలెత్తి పోయిన చంద్రబాబు, ప్రతిపక్షపార్టీ ప్రకటించిన పథకాలను నిస్సిగ్గుగా కాపీ కొట్టే ఈ నాయుడు గారు, ప్రస్తుతం ఏకంగా ఉగ్రదాడిపై సంచలన ఆరోపణలు చేయడంలో ఆశ్చర్యం ఏముందిలెండి. అమర జవాన్ల త్యాగం గురించి కూడా రాజకీయం చేయడం ఆయనకే చెల్లింది. అయినా ఆయన ఏం చేసినా సంసారం వెరెవరైనా అదేపని చేస్తే వ్యభిచారం అన్నమాట.

TDP Vyabhichaaram కోసం చిత్ర ఫలితం

ఓటుకు నోటు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో ప్రజాధన దుబారా, నవనిర్మాణ, ధర్మపోరాట దీక్షల పేరుతో విచ్చలవిడి జన ధన దోపిడీ, కేంద్ర నిధుల దారి మళ్లింపు, కేంద్ర ప్రొజెక్టులు రాష్ట్ర ప్రోజెక్టులుగా తన ఫోటోలతో ప్రచారం, 600 వాగ్ధానాలు చేసి 60 కూడా నేరవేర్చని ఆయన నిజాయతీ లోని నిప్పు, రాజధాని పుట్టక మునుపే కాల్మని, కల్తీ, ఎర్రచందనం, ఇసుక, ఎక్సైజ్, సెక్స్ రాకెట్, భూకబ్జాల పేరుతో మాఫియాలకు నిలయంగా ఎదుగుతూనే ఉంది - ఇన్ని పాపాల పుట్ట టిడిపి చేసేది రాజకీయ వ్యభిచారమే అయినా తాను అపర గోబెల్ లాగా సంసారం బ్రాండింగ్.    

మరింత సమాచారం తెలుసుకోండి: