వైసీపీ అధినేత జగన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. పాదయాత్రకు ముందు తరువాత అని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. జగన్ హైదరాబాద్ లో ఉంటే ప్రతీ రోజూ బిజీనే. వరసగా రాజకీయ మీటింగులు సెలిబ్రిటీలతో భేటీలు,  ఆపైన పార్టీ మారి వచ్చిన వారికి కండువాలు కప్పడంతో అధికార టీడీపీకి గత వారంగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇపుడు జగన్ లండన్ వెళ్ళారు...


అక్కడ కూడానా :


వారం రోజుల పాటు ఏపీలో జంపింగులకు తెర పడుతుందని, షాక్ ట్రీట్మెంట్లకు సెలవు అలా దొరుకుతుందని ఆశించిన వారికి ఇపుడు మరింత టెన్షన్ పట్టుకుందందట. జగన్ లండన్ ట్రిప్ సైతం రాజకీయాలతో తిరుగుతుందని అంటున్నారు. నిజానికి జగన్ తన కుమార్తెను చూడడానికి వెళ్తున్నారు. ఇది ముందుగా అనుకున్న ప్రోగ్రామే. అయితే వాయిదా పడుతూ ఇప్పటికి కుదిరింది. కానీ జగన్ లండన్లో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా పెట్టుకున్నారట. అందులో భాగంగా పలువురు పారిశ్రామిక వేత్తలను కలుస్తారని టాక్.


అపర కుబేరుడితో భేటీ ;


ఇక జగన్ తన లండన్ టూర్లో అపర కుబేరుడుగా పేరు గడించిన లక్ష్మీ మిట్టల్ తో భేటీ వేస్తున్నారుట. ఇది నిజంగా సెన్సేషనల్ న్యూసే. లండన్ లో ఉండే భారతీయ నేపథ్యం ఉన్న పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్ తో జగన్ సమావేశం కాబోతున్నారని సమాచారం. పారిశ్రామికవేత్తగా - గొప్ప శ్రీమంతుడిగా లక్ష్మీ మిట్టల్ కు పేరుంది. బ్రిటన్ లోని అపరకుభేరుల్లో కూడా టాప్ లో ఉంటారు మిట్టల్. ఆయనతో జగన్ సమావేశం కాబోతున్నారని సమాచారం. అలాగే పేరున్న వైద్యులు.. పలు హాస్పిటల్స్ ను నెలకొల్పిన ప్రేమ సాగర్ రెడ్డిని కూడా జగన్ కలవబోతున్నారని తెలుస్తోంది. ఇలా పారిశ్రామిక వేత్తలు - ప్రముఖులతో జగన్ లండన్లో సమావేశం కాబోతున్నారని భోగట్టా.


మరింత వూపు :


ఇక   ఏపీలో వైఎస్సార్సీపీకి ఊపు ఉన్న నేపథ్యంలో.. జగన్ తో సదరు ప్రముఖులు  కూడా సమావేశానికి ఉత్సాహం చూపిస్తున్నారని సమాచారం. మొత్తం మీద జగన్ కదలికలు ఇపుడు ఏపీ రాజకీయాలను బాగా  ప్రభావితం చేస్తున్నాయి. ఆయన్ని ఎవరు కలిసినా అది పాజిటివ్ బజ్ అవుతోంది. రేపటి రోజున ఏపీకి కాబోయే సీఎం కాబట్టే కలుస్తునారని అంతా భావిస్తున్నారు. ఓ విధంగా ఏపీలో జగన్ లేని వేళ ఈ కలయికలు, సమావేశాలు కూడా వైసీపీకి మరింత సానుకూలతను తెచ్చిపెడతాయన్నది సందేహం లేదు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో మార్పులు వస్తాయని అంతర్జాయీతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: