కాంగ్రెస్ బరి తెగించింది. గాంధి నెహౄ డైనాటీ పాలన వారికి కావాలి. బానిసలకు స్వంతంగా ఆలోచించే అవసరమే ఉండదు. పుల్వామా ఉగ్రదాడితో దేశమంతా విషాదంలో మునిగిపోతే ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి  నితీష్ కుమార్ హాయిగా నవ్వుకుంటున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.  దాడి తర్వాత దిగిన ఫొటో అంటూ షేర్ చేస్తున్నారు.
 

ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ సరదాగా నవ్వుకుంటున్న ఫొటోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "అత్యంత విషాద విపత్కర సమయంలో మీరు ఎంత హాయిగా నవ్వుకుంటున్నారు. సామాన్యులకు వారినేతలు ఎలాంటి వారో తెలుసుకోవడం చాలా కష్టం" అని ధీరేంద్ర ఝా ట్వీట్ చేశాడు. (ధీరేంద్ర ఒక జర్నలిస్ట్ స్క్రోల్.ఇన్ స్టాఫర్)

"దేశమంతా అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులర్పిస్తుంటే, పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో? ఆలోచించకుండా సరదాగా నవ్వుకోవడం నన్ను ఆశ్చర్యానికి లోను చేసింది"  అని ముంబై కాంగ్రెస్ యూత్ కమిటీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ ట్వీట్ చేశారు. సున్నితమైన అంశాలలో సీరియస్‌గా ఉండాలని,  కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారో? చూడండి అని యూత్ కాంగ్రెస్ అధికార ట్విట్టర్ ఖాతాలో ఫొటోలు పోస్ట్ చేశారు.


మహిళా రాజకీయ నాయకురాలు కవితా క్రిష్ణన్ సైతం ట్విట్టర్‌లో నరేంద్ర మోదీ తీరును ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నేతలను కలుసుకున్నట్లుగా హాయిగా నవ్వుకుంటున్నారని తన ట్వీట్‌ ద్వారా మోదీ, నితీష్, సాక్షి మహరాజ్‌లను ఆమె ప్రశ్నించారు. పుల్వామా దాడిపట్ల ఆలోచించాలని వీరికి లేదని కవితా క్రిష్ణన్ అభిప్రాయపడ్డారు
ఆ పోస్ట్ డిలీజ్ చేసి, మరో పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 17న బెగుసరాయ్ లోని బరౌనిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో మోదీ, నితీష్ నవ్వులు చిందిస్తున్న మరో ఫొటోను అప్‌లోడ్ చేశారు.. 


 
ధీరేంద్ర ఝా ట్వీట్ 

गमगीन माहौल में ऐसी हंसी!सचमुच में नेताओं को जानना मुश्किल है आमजनों के लिए!
885

9:51 - Feb  17, 2019

 
సంజయ్ నిరుపమ్ ట్వీట్-



అదే ఫొటోతో గూగుల్‌లో రివర్స్ ఇమేజ్-సెర్చ్ చేస్తే అసలు విషయం బయటపడింది. 2015లో జులై26న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫొటోను ప్రచురించింది. పట్నాలో జులై 25న మోదీ, నితీష్ ఒకే వేదిక పంచుకున్న సందర్భంగా తీసిన ఫొటో అని పీటీఐ వారు చెబుతున్నారు. 


నిర్ధారణ 
ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీష్ నవ్వుతున్నట్లు ప్రచారం చేసిన ఫొటో 2015లో తీశారు. అయితే పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తుంటే, దేశమంతా విచారం వ్యక్తం చేస్తుంటే నరేంద్ర మోదీ, నితీష్ తమకు పట్టనట్లుగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని దుష్ప్రచారం చేశారు.  ఫిబ్రవరి 17న బరౌనీలో అభివృద్ధి కార్యక్రమంలో వీరు పాల్గొన్న సందర్భంగా ఆ ఫొటో తీశారు. 


అదంతా నిజమేనా? అని ఒక ప్రముఖ ఆంగ్ల జాతీయ మీడియా సంస్థ పరిశీలనలో అదెప్పటిదో పాత ఫొటో అని తేలింది. అవకాశం దొరికితే కాంగ్రెస్ వాళ్లు మోడీపై బురద చల్లటానికి డైనాస్టీ పాలనను ఆహ్వానించటాని ఎప్పుడూ సిద్ధమే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: