భారత దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నెల 14న  పుల్వామలో సైనికులపై జరిగిన దాడి గురించే చర్చలు జరుగుతున్నాయి. చిన్నా పెద్దా, కుల..మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దాయాది దేశమైన పాకిస్థాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గత కొంత కాలంగా భారత సైన్యం టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు జరుగుతున్న దుశ్చర్యకు పాక్ ప్రేరేపిస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.  మరోవైపు పుల్వామా దాడి తమ పని కాదని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ భారత్‌ను డిమాండ్ చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌కు ఆ దేశ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ షాకిచ్చింది.  పుల్వామా దాడి తమ పనేనంటూ మరో వీడియోను విడుదల చేసింది. అంతే ల్వామా లాంటి దాడిని చేయగలమని అందులో పేర్కొనడం గమనార్హం. 
Image result for terrorest
కాగా, ఇప్పటి వరకు భారత పై తమకు ఎలాంటి ద్వేశం లేదంటూ ముసలి కన్నీరు కారుస్తున్న పాకిస్థాన్ ఈ వీడియోకు ఏం సమాధానం చెబుతారని భారత్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది.   ఈ నెల 14న సెలవులు ముగించుకొని జమ్ము నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది.
Image result for pulwama attack
ఈ ఘటనలో 40 మంది సైనికులు అమరులయ్యారు.  ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే  దాడి తమపనేనంటూ కాసేపటికే జైషే మహ్మద్ వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు రెండో వీడియోను విడుదల చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: