కే ఏ పాల్.. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. మొదట్లో చిన్న చిన్న ఛానళ్లలో లైవ్ కు వచ్చిన పాల్ ఇప్పుడు ప్రముఖ ఛానళ్లలోనూ కనిపిస్తున్నాడు. తాజాగా ఓ ఛానల్ కు లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చిన కే ఏపాల్ అనూహ్యంగా లైవ్ నుంచి పారిపోవడం ఆసక్తి రేపుతోంది.

ka paul swetha reddy కోసం చిత్ర ఫలితం


ఇటీవల పాల్ మహా టీవీకి ఇంటర్వ్యూకు వచ్చాడు. లైవ్ డిస్కషన్ నడుస్తోంది. ఐతే.. ఓ ప్రశ్న అడిగిన తర్వాత దానికి సమాధానం ఇచ్చే అవకాశం ఇవ్వకపోతే కే ఏ పాల్ యాంకర్లపై రెచ్చిపోతున్నాడు. మీకు ఇంటర్వ్యూ చేయడం కూడా చేతకాదా అంటూ ఫైర్ అవుతున్నాడు.

ka paul swetha reddy కోసం చిత్ర ఫలితం


మహాటీవీలోనూ అదే పరిస్థితి. పాపం మేల్ యాంకర్ పాల్ తో గొడవెందుకులెమ్మని పాల్ కు బాగానే మాట్లాడే ఛాన్స్ ఇచ్చాడు. ఇక అప్పుడు మొదలైంది అసలైన కథ. ఇటీవల పాల్ టిక్కెట్ ఇస్తానని మోసం చేశాడంటూ ఆరోపిస్తున్న శ్వేతారెడ్డి లైవ్ లోకి వచ్చేసింది. యాంకర్ ఈవిషయాన్ని కే ఏ పాల్ కు చెప్పారు.

సంబంధిత చిత్రం


పాల్ గారూ..మన డిష్కషన్ చూసి యాంకర్ శ్వేతారెడ్డి వచ్చారు. ఆవిడ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు.. అని చెబుతుండగానే కే ఏపాల్..తన చెవులకు ఉన్న మైకులను తీసేసుకున్నాడు. సమయం తొమ్మిది అవుతోంది. ఇక నాకు వేరే పనుంది అంటూ లైవ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాల్ పారిపోయాడన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: