2019 ఎన్నికలు పట్టుమని మరో రెండు నెలలు కూడా లేవు. ఓ వైపు టీడీపీ నుంచి వైస్సార్సీపీలోకి ఎడతెగని వలసలు ఎప్పుడు ఏపార్టీ నేత వెళ్లి పోతాడనే భయం లో టీడీపీ ఉందంటే అతిశయెక్తి కాదు. ఇంకో పక్క జాతీయ సర్వేలు వైస్సార్సీపీ కి అనుకూలంగా జై కొడుతున్నాయి. అయితే ఇప్పుడు తోటా త్రిమూర్తులతో తలసాని శ్రీనివాస్ భేటీ కావడం తో చంద్ర బాబు కు ఎక్కడ లేని టెన్షన్ మొదలైంది.

Image result for chandra babu

వైఎస్సార్సీపీలోకి వెళ్ళే క్రమంలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆశీస్సుల్ని తోట త్రిమూర్తులు తీసుకుని వుంటారంటూ టీడీపీకి వత్తాసు పలికే మీడియా సంస్థలు కథనాలు షురూ చేశాయి. అయితే, పార్టీ మారే విషయమై తోట త్రిమూర్తులు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఇటీవల మంత్రిగా తలసాని పదవీ ప్రమాణ స్వీకారం చేశారనీ, తనకు ఎప్పటినుంచో స్నేహితుడైన తలసానిని అభినందించడానికే వచ్చాననీ తోట త్రిమూర్తులు చెబుతున్నారు. 

Image result for chandra babu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో జతకట్టిన చంద్రబాబు, టీఆర్‌ఎస్‌ని ఓడిస్తామంటూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం విదితమే. ప్రత్యేకించి సనత్‌నగర్‌ నియోజకవర్గంలో బాలయ్యతో చంద్రబాబు ప్రచారం చేయించిన తీరు, ఈ క్రమంలో బాలయ్య చేసిన హంగామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గుంటూరు జిల్లాకి చెందిన టీడీపీ నేతలు కొందరు, సనత్‌ నగర్‌ నియోజకవర్గంలో డబ్బులు పంచారన్న ప్రచారమూ జరిగింది. వాటన్నిటికీ ఇప్పుడు తలసాని ఇదిగో, ఇలా బదులు తీర్చుకుంటున్నారని అనుకోవాలేమో.! 


మరింత సమాచారం తెలుసుకోండి: