తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఎస్సీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది.  ఎస్సీలను ఉద్దేశించి చింతమనేని మాట్లాడుతూ, ‘పిచ్చి ముండా కొడకల్లారా మీకెందుకురా పదవులు. రాజకీయాలు, పదవులు కావాల్సింది మాకురా’ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని ఎస్సీ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలోని అనేక చోట్ల చింతమనేనిపై ఎస్సీ సంఘాలు కేసులు పెడుతున్నాయి.  

 

 చింతమనేని వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఇంత గోల జరుగుతున్నా టిడిపిలోని ఒక్క ఎస్సీ నేత కూడా నోరు మెదపలేదు. కెఎస్ జవహర్, నక్కా ఆనందబాబు లాంటి ఎస్సీ మంత్రులున్నా ఒక్కరంటే కనీసం ఒక్కరు కూడా మాట్లాడకపోవటం విచిత్రంగా ఉంది. వీళ్ళు కాకుండా అనేకమంది ఎస్సీ ఎంఎల్ఏలు, నేతలున్నారు. వాళ్ళు కూడా చింతమనేని వ్యాఖ్యలపై నోరిప్పటం లేదంటే టిడిపిలో పరిస్ధితి ఎలాగుందో అర్ధమైపోతోంది. రోజువారి టెలికాన్ఫరెన్సుల్లో చంద్రబాబునాయుడు లక్ష్మీస్ ఎన్టీయార్, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారే కానీ చింతమనేని వ్యాఖ్యలపై మాట్లాడలేదు.

 

నిజానికి చింతమనేని ఇలా మాట్లాడుతున్నారంటే అందుకు చంద్రబాబే బాధ్యుడు. మొదట్లోనే చింతమనేనిని కట్టడి చేసుంటే ఇపుడిలా మాట్లాడేవారు కాదేమో ? రాబోయే ఎన్నికల్లో ఎస్సీలు తమకు ఎలాగూ ఓట్లేయరని చంద్రబాబు అనుకున్నారా ? అన్న సందేహాలు వస్తున్నాయి. లేకపోతే చింతమనేని ఎలా మాట్లాడినా ఓట్లేయకుండా ఎక్కడికి పోతారన్న ధీమానా ? అర్ధం కావటం లేదు. చింతమనేని వ్యాఖ్యలపై రాష్ట్రంలో దుమారం జరుగుతున్న చినబాబు నారా లోకేష్ ఇంతవరకూ కనీసం ట్విట్టర్లో అయినా ఎందుకు స్పందించలేదో ?


మరింత సమాచారం తెలుసుకోండి: