తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖను తన వద్దే ఉంచుకోవడంతో... ఆర్థికమంత్రిగా ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను బట్టి... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుందని తెలిపారు. అంతకు ముందు పుల్వామా అమరవీరులకు సభ నివాళి అర్పించింది.

అనంతరం టీబ్రేక్ కోసం సభ వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన వెంటనే బడ్జెట్ ను కేసీఆర్ ప్రవేశపెట్టారు.  తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.  గతంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాసు బ్రహ్మానంద రెడ్డి, రోశయ్యలు ముఖ్యమంత్రులుగా ఉండి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 

కేసీఆర్ బడ్జెట్ హైలేట్స్ :
- ఒకప్పుడు తెలంగాణ ప్రాంత వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్లు పెరిగింది.
- తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం.
- అన్ని రాష్ట్రాల్లోనూ తెలంగాణ మోడల్‌ గురించి చర్చ జరుగుతోంది.
- పేదల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికలు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని, రూ.1000 నుంచి రూ.2,116కు పెంచుతున్నాం.
- 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10.6శాతంగా నమోదైంది.
-  మరోసారి ప్రజలు తెరాసకు అధికారం ఇచ్చి ప్రభుత్వంపై విశ్వాసాన్ని చాటారు.
-  దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,116కు పెంచుతున్నాం.
- వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను అందిస్తాం.
- ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.12,067కోట్లు కేటాయిస్తున్నాం.

-  2019-20 సంవత్సారానికి మొత్తం బడ్జెట్‌ రూ.1,82,017కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ.1,31,629కోట్లు
 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1450కోట్లు.
- నిరుద్యోగ భృతి కోసం రూ.1810కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు
- రైతు రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు
- మూలధన వ్యయం రూ.32,815కోట్లు
-  రెవెన్యూ మిగులు రూ.6,564కోట్లు
- ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581కోట్లు
- ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9,827కోట్లు
-  బియ్యం రాయితీకి రూ.2,774కోట్లు
- ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
- వ్యవసాయశాఖకు రూ.20,107కోట్ల కేటాయింపు.
- రైతు బీమా కోసం రూ.650కోట్లు
- రైతు బంధు సాయం ఎకరానికి రూ.10వేలు. ఇందు కోసం రూ.12వేల కోట్లు కేటాయింపు

- 2019-20 బడ్జెట్‌లో నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు కేటాయింపు
- ఈఎన్‌టీ, దంత పరీక్షలు రూ.5,536కోట్లు
- 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8లక్షల నిధులు
-  టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.1.41లక్షల కోట్ల పెట్టుబడులు
-  పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రూ.3,256కోట్లు
- ఒక్కో మనిషికి రూ.1,606 చొప్పున ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు
- టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.8,419 పరిశ్రమలకు అనుమతులు
- 8.58లక్షల ఉద్యోగాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: