భారత దేశ సైనికులను టార్గెట్ చేసుకొని పుల్వామ లో ఆత్మాహుతి దాడి జరిగింది..ఈ దాడిలో 40 మంది సైనికులు వీరమరణం పొందారు. అప్పటి నుంచి భారత దేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కానీ కొంత మంది మాత్రం కాశ్మీర్, పాకిస్థాన్ కి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో విమర్శలపాలవుతున్నారు.
తాజాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, జెకెఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ను కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి అనంతరం వేర్పాటువాద నేతలకు భద్రతను ఉపసంహరించిన ప్రభుత్వం తాజాగా, శుక్రవారం అర్ధరాత్రి యాసిన్ మాలిక్ను అదుపులోకి తీసుకుంది.
జమ్ముకశ్మీర్కు చెందని వారు ఆ రాష్ట్రంలో స్థిరాస్తిని కలిగివుండడాన్ని (కొనుగోలు చేయడాన్ని) నిషేధించే ఆర్టికల్ 35-ఎపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాగా, మైసుమా పట్టణంలోని ఆయన స్వగ్రహం నుంచి మాలిక్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం కోఠిబాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.మాలిక్ను అరెస్ట్ చేయడం జరిగిందని అనధికార వర్గాల సమాచారం.