భారత రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ప్రత్యేక పేరు ఉంది. నెల్లూరులో నాలుగోరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నాలుగోరోజు పర్యటిస్తున్నారు. ఈరోజు వెంకటాచలంలో ఆయన వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాతృభాష పరిరక్షణకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దానికోసం ఏం చేస్తామన్నది రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాలని సూచించారు.
ఇక నుంచి తాను ఐదు అంశాలపై దృష్టి సారిస్తానని తెలిపారు. దేశవ్యాప్తంగా పర్యటించి యువకుల్లో స్ఫూర్తి నింపుతానని వెంకయ్య పేర్కొన్నారు. రైతులను కలుసుకొని వారి సమస్యలపై దృష్టి సారిస్తానని.. భారతీయ సంస్కృతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతానని చెప్పుకొచ్చారు.
తన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరూ రారని వెంకయ్యనాయుడు తేల్చిచేప్పారు. వారంతా స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.