ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో అక్కడ ముఖ్య పార్టీల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది.   అయితే అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెడుతుందని..వివిధ జిల్లాల్లో టీడీపీ నేతలు ఇతరుల చేత సర్వేలు జరుపుతూ తమ పార్టీకి చెందిన వారివి..సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు.  ఇటీవల విజయంనగరం జిల్లాలో పలు గ్రామాల్లో టీడీపి వర్గానికి చెందిన వారు కొంత మంది సర్వేలు నిర్వహించి వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగించి వేస్తున్నారని..బొత్స సత్యనారాయణ వీరి తతంగాన్ని బయటపెట్టారని కానీ అధికారం తమ చేతిలో ఉంది కదా అని ఆ విషయాన్ని పక్కదోవ పట్టించారని వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. 
Related image
తాజాగా తిరుపతిలోని యర్రావారిపాలెంలో ఇలాంటిదే చోటు చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో యర్రావారిపాలెం మండల కేంద్రంలోని ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం కొంతమంది యువకులు ట్యాబ్‌లతో వచ్చి పలువురితో గ్రామస్థులతో మాట్లాడటం స్థానికులు గమనించారు.  ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వేణుగోపాల్ రెడ్డి అక్కడకు చేరుకుని వారిని నిలదీశారు.  అంతే కాదు ఫాం  7 నింపి ఓట్లను తొలగిస్తున్నారని, ట్యాబ్‌ను ఎన్నికల సంఘానికి ఇస్తామని వేణుగోపాల్ రెడ్డి పేర్కొంటూ వెళ్లిపోయారు. దాంతో ఆ యువకులు వేణుగోపాల్ రెడ్డి తమ వద్ద నుంచి అన్యాయంగా ట్యాబ్ లు లాగేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదే రోజు రాత్రి వేణుగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యె చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు యర్రావారిపాలెం పీఎస్‌కు చేరుకున్నారు. ఓట్ల గల్లంతుపై నిలదీసినందుకు తమ నేతపై అక్రమంగా కేసు బనాయించి..అర్థరాత్రి అరెస్ట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికార పార్టీ నిరంకుశత్వానికి ఇది నిదర్శనమని  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేణుగోపాల్ రెడ్డిని రిలీజ్ చేయాలంటూ పీఎస్ ఎదుటే బైఠాయించారు.

దీంతో అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తతంగా మారింది.  ఆ మద్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఓటర్ జాబితాలో ఏకంగా 65 లక్షల దొంగ ఓట్లు చేర్చిందని కంప్లయింట్ ఇచ్చారు.  ఇదే విషయంపై గవర్నర్ ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: