ఉత్తరప్రదేశ్ లోని భాదోహి ప్రాంతంలో ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పదిమంది మృతిచెందగా.. మరో ముగ్గురు గాయడ్డారు. భవనంలో టపాసులు ఉంచడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలిసింది. క్రాకర్స్కు మంటలు అంటుకోవడంతో.. భారీ విస్ఫోటనం జరిగినట్టు తెలుస్తోంది. ఈ భారీ విస్ఫోటనం దాటికి రెండంతస్థుల బిల్డింగ్తో పాటు మరో మూడు ఇళ్లు కూడా కుప్పకూలిపోయాయి.
మృతుల్లో దుకాణం నడుపుతున్న కలియార్ మన్సూరి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. షాపు వెనుకాలే ఆయన కుమారుడు కార్పెట్ ఫ్యాక్టరీ ఒకటి నడుపుతున్నాడని, శిథికాల కింద చిక్కుకున్న వారిలో ఆ షాపు వర్కర్లు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. రెండస్తుల భవనంలో కార్పెట్లను తయారు చేసే కంపెనీ ఉండగా.. ఇందులోనే అక్రమంగా ఫైర్ క్రాకర్లను కూడా తయారు చేస్తున్నట్టు ప్రాధమికంగా గుర్తించామని భాదోహి ఐజీ పియూష్ శ్రీవాస్తవా తెలిపారు.
అయితే పుల్వామా దాడుల తర్వాత మరిన్ని దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో… ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు తెలిపారు. ఫోర్సెనిక్ నిపుణులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. సహాయక కార్యక్రమాల కోసం క్రేన్లను రంగంలోకి దింపారు.