రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు 100 శాతం ఓడిపోతారని కెటియార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన కెటియార్ రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తాడంటూ జోస్యం చెప్పటం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఓటమిపై కెటియార్ అంత ఘంటాపథంగా చెబుతున్నారంటే ఆయనకున్న ఆధారాలేమిటో మాత్రం చెప్పలేదు. కెసియార్, జగన్ గురించి మాట్లాడుతూ వాళ్ళిద్దరూ కలవాల్సిన సమయంలో కలుస్తారంటూ నర్మగర్భంగా జవాబును దాటేయటం చూస్తుంటే తెరవెనుక ఏదో పెద్ద కథే నడుస్తోందని అనుమానంగా ఉంది.

 

ఏపికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ ఒక్క పని కూడా చేయలదేన్నారు. అలాంటిదేదైనా ఉంటే చూపించాలని ఛాలెంజ్ చేయటం ఆశ్చర్యంగా ఉంది. కెసియార్ విషయంలో చంద్రబాబు ఎన్నిరకాలుగా భావోద్వేగాలను రెచ్చ గొట్టాలని చూసినా సాధ్యం కాదన్నారు. ఎందుకంటే, ఏపి ప్రజలు చాలా తెలివైనోళ్ళు కాబట్టే భావోద్వేగాలకు మోసపోరని కూడా కితాబిచ్చారు. అంటే ఒకవైపు చంద్రబాబుపై మైండ్ గేమ్ ఆడుతునే మరోవైపు జనాలను దువ్వుతున్నారు కెటియార్.

 

ఓటమి విషయంలో చంద్రబాబులో నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తోందంటూ చంద్రబాబును రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం గమనార్హం. నిద్రలో కూడా కెసియార్ నే చంద్రబాబు కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తనకు వ్యతిరేకంగా ఏ డెవలప్మెంట్ జరిగినా అదంతా జగన్, కెసియార్, మోడి కలిసే చేసిన కుట్ర అనటం చంద్రబాబుకు అలవాటైన ఊతపదంగా కొట్టిపారేశారు. ఢిల్లీలో కాదు కదా చివరకు విజయవాడలో కూడా చక్రం తిప్పలేరంటూ చంద్రబాబును తీసిపారేశారు. పారిశ్రామికవేత్తలైన ఎంపిల మీద ఐటి దాడులు జరుగుతుంటే ఎందుకు ఉలికిపడుతున్నారంటూ కెటియార్ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెబుతారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: