తెలంగాణ రాష్ట్ర సమితి నేతల వైఖరి చూస్తుంటే.. వారు టీడీపీతో కుమ్మక్కయ్యారేమో అనే అనుమానం కలుగుతోంది. సీఎంగా గెలిచిన రెండో రోజే కేసీఆర్ చంద్రబాబుకు రిటన్ గిఫ్ట్ ఇస్తా అంటూ కామెంట్ చేశారు. అందరూ దీన్ని ప్రతీకారం తీర్చుకోవడమేమో అనుకున్నారు.



కానీ టీఆర్ఎస్ తీరు చూస్తుంటే... చంద్రబాబుకు నిజంగానే వారు బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేశారేమో అనిపిస్తోంది. తాజాగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కామెంట్లు చూస్తే అలాగే ఉంది. రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధినేత జగన్ గెలవబోతున్నారని కేటీఆర్ జోస్యం చెప్పారు.



చేతకాని తనం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఓడిపోనున్నారని చెప్పారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెబుతున్న చంద్రబాబు... కనీసం విజయవాడలో కూడా చక్రం తిప్పలేరని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని ఓవైపు... దేశంలో మేమే నెంబర్ వన్ అని మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని చెప్పారు.



ఇలా కేటీఆర్ కామెంట్ చేశారో లేదో వెంటనే లోకేశ్ స్పందించారు. చూశారా మేం చెబుతున్నట్టుగానే కేసీఆర్, జగన్, మోడీ కుమ్మక్కయ్యారంటూ పాత ఆరోపణలు మరోసారి గుప్పించారు. ఇది బయట నుంచి చూసే తటస్తులకు నిజమే కదా అనిపించడం ఖాయం. టీఆర్ఎస్ నేతల ఇలాంటి కామెంట్ల వల్ల జగన్ కు నష్టమే తప్ప ఏమాత్రం లాభం ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: