వైసీపీ అధ్యక్షుడి వైఎస్ జగన్మోహనరెడ్డిపై గతేడాది అక్టోబర్ 25 న విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఉమ్మడి హైకోర్టు, దాడి జరిగిన ప్రదేశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ కేసు విచారణ జాతీయ సంస్థలకు ఇవ్వొచ్చని అభిప్రాయపడింది. దీంతో కేసును ఎన్ఐఏ కు అప్పగించింది కేంద్రం.
అయితే ఈ కేసులో ఇటీవలే చార్జ్షీట్ సైతం దాఖలు చేసింది ఎన్ఐఏ. అయితే, ఇప్పుడు ఎన్ఐఏ విచారణపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట ఈ కేసును రహస్యంగా విచారించాలని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది.
ఈ కేసులో నిందితులు, న్యాయవాదుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎనైఏ కోర్ట్ ప్రకటించింది. అంతే కాదు, విచారణకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచురించ కూడదన్న ఆడేసాలు ఇచ్చింది.