ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆ మద్య బాలికపై కామాంధులు అత్యాచారాలు.. అమరావతిలో జ్యోతి హత్య ఘటన తెలిసిందే. తాజాగా మరో యువతి కామంధుల కాటుకు బలైంది. జ్యోతి హత్య ఘటన మరువకముందే పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు ఇదే తరహాలో మరో దారుణం చోటుచేసుకుంది. కామవరపుకోట మండలం జీలకర్రగూడెం పరిధిలోని గుంటుపల్లి గుహాల వద్దకు వెళ్లిన ఓ జంటపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన దాడిలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా యువకుడు తీవ్ర గాయపడ్డాడు.
యువతి ఆదివారం ఉదయమే కళాశాలలో స్పెషల్ క్లాస్ ఉందంటూ భీమడోలు వెళ్లింది. అక్కడ నుంచి ఆమె నవీన్ మోటారు సైకిల్పై గుంటుపల్లి గుహాల వద్దకు చేరుకున్నారు. వీరిద్దరూ కలిసి కొండపైకి వెళ్లేందుకు టిక్కెట్ తీసుకున్నారని అక్కడ వాచ్మెన్ చెపుతున్నాడు. ఉదయం వెళ్లిన వారు మధ్యాహ్నం..కూడా రాకపోవడంతో వాచ్ మెన్ కి అనుమానం వచ్చి కొండపైకి వెళ్లగా ధరణి నగ్నంగా జీవచ్ఛవంగా పడి ఉంది. ఆమె పక్కనే నవీన్ తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు.
వెంటనే వాచ్ మెన్ స్థానికులకు తెలుపగా..ఆదివారం రాత్రి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధరణికి తలపై మినహా శరీరంపై ఎక్కడా గాయాల్లేవు. ధరణికి, నవీన్కు ఇద్దరికీ తల వెనుక భాగంలోనే బలమైన గాయాలున్నాయి. అయితే పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని ఎఎస్పి కె.ఈశ్వరరావు, జంగారెడ్డిగూడెం డిఎస్పి మురళీకృష్ణ, చింతలపూడి సిఐ విల్సన్ పరిశీలించారు.