కొన్ని రోజుల నుంచి టీడీపీ నాయకులకు ఏమైందో కాని తమ నియోజకవర్గాన్ని లోకేష్ కోసం ఇస్తామని ప్రకటిస్తున్నారు. అయితే ఈ ప్రకటనలు టీడీపీ యువ నాయకుడు లోకేష్ ను దెప్పి పొడుస్తున్నట్టున్నాయి. లోకేష్ కోసం తను త్యాగానికి రెడీ అని ఇటీవల కర్నూలు ఎమ్మెల్యే, ఫిరాయింపు నేత ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ తనకు దక్కని పక్షంలో లోకేష్ అక్కడ నుంచి పోటీచేయాలని ఎస్వీ షరతు విధిస్తూ ఉన్నారు! ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రమేకాదు.. ఇప్పుడు మంత్రి గంటా కూడా అదే జాబితాలోకే చేరారు.

Image result for lokesh

తనను విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తే.. భీమిలి నుంచి లోకేష్ పోటీచేయాలని గంటా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు! భీమిలి సీటును లోకేష్ కోసం త్యాగంచ ఏయడానికి  తను రెడీ అని గంటా ప్రకటించుకున్నారు. ఇలా తెలుగుదేశం నేతలకు ఒకరికి మించి మరొకరు తమ తమ సీట్లను త్యాగం చేయడానికి రెడీ అంటున్నారు. అయితే వీళ్ల త్యాగాలను లోకేష్ బాబు గుర్తించడం లేదు.

Image result for lokesh

రాజకీయ నేతలు దేన్నైనా త్యాగం చేస్తారు కానీ.. తమ నియోజకవర్గం టికెట్ ను మాత్రం త్యాగంచేయరు. అదేంటో లోకేష్ కోసం తెలుగుదేశంలో త్యాగం చేస్తామనే వారి జాబితా రోజురోజుకూ పెరిగి పెద్దది అవుతోంది. ఇది మరింత పెద్దది అయ్యేలోపు లోకేష్ స్పందించి, ఎవరి త్యాగాన్ని పరిగణనలోకి తీసుకుని తను ఎమ్మెల్యేగా పోటీచేస్తారో.. ప్రకటిస్తారేమో చూడాలి! ఇప్పటివరకూ లోకేష్ విషయంలో ఆ కసరత్తే జరుగుతున్నట్టుగా కనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: