భారత దేశంలో కొంత కాలంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైనికులపై రక రకాలుగా దాడులకు తెగబడుతున్నారు.  గత సంవత్సరం పంజాబ్ యూరి సెక్టార్ పై దాడి చేశారు.  ఇక పుల్వామ దాడిలో దారుణంగా 40 మంది వీర జవాన్లను పొట్టన బెట్టుకున్నారు.  దాంతో భారత సైనికులకే కాదు ఇక్కడ ఉంటున్న ప్రతి భారతీయుడు ఉగ్రవాదులపై రగిలిపోయారు. 
Image result for indian air force attack terrorists
ఇక మోదీ ప్రభుత్వం దెబ్బకు దెబ్బ అనే విధంగా ప్రతీకార చర్యకు పూనకుంటుంది.  మరోవైపు దాయాది దేశమైన పాకిస్థాన్ తమపై అబాండాలు వేయవొద్దని ఉగ్రవాదులకు తమకు ఎలాంటి సంబంధాలు లేవని..ఉంటే అవి నిరూపించి మాట్లాడాలని అంటుంది.  తాజాగా తెల్లవారు జామున 3.30 గంటలకు 12 మిరేజ్ -2000 జెట్ ఫైటర్స్ తో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది.   అర్థరాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి దూసుకు వెళ్లిన భారత్ యుద్ద విమనాలు.
Image result for indian air force attack terrorists
బాలాకోట్, చోటీ ముజఫరబాద్ లోని 3 ఉగ్రశిబిరాల ధ్వంసం. భారత సర్జికల్ స్ట్రైక్ 2... సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకర దాడి చేసింది. భారత వైమానిక బృందం  సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రక్యాంపులను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్‌ పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: