అనుకున్నట్టే అయ్యింది.. కాశ్మీర్లో పాకిస్థాన్ సృష్టించిన నరమేథానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడిందిఎల్‌వోసీ.. వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకర  దాడి చేసింది

సంబంధిత చిత్రం

భారత వైమానిక బృందం ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు దాదాపు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రక్యాంపులపై విరుచుకుపడింది. 12 మిరాజ్‌-200 జైట్‌ ఫైటర్స్‌తో ఈ దాడి జరిగింది. వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు వంద శాతం విజయవంతమయ్యాయని ఆర్మీ చెబుతోంది.

airforce attack on కోసం చిత్ర ఫలితం


అనుకున్న టార్గెట్ ప్రకారం దాడులు అనుకున్నట్లు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఐతే.. ఈ దాడులపై పాకిస్తాన్ విభిన్నంగా స్పందించింది.

సంబంధిత చిత్రం


భారత్ వైమానిక దళం జరిపిన దాడిలో తమకు ఎలాంటి నష్టం జరగలేదని పాక్ ప్రకటించింది. కాకపోతే.. ఈ ప్రకటన ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. అంతర్జాతీయంగా పరువు కాపాడుకునేందుకే పాక్ ఇలాంటి కల్లబొల్లి ప్రకటనలు చేస్తోందని నిపుణలు భావిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు భారత్ బయటపెడితే కానీ అసలు విషయాలు ప్రపంచానికి అర్థం కావు.


మరింత సమాచారం తెలుసుకోండి: