గత కొంత కాలంగా భారత దేశ సహనాన్ని పరీక్షిస్తున్న ఉగ్రవాదులకు దెబ్బకు దెయ్యం వదిలేలా చర్యలకు పాల్పపడింది సైన్యం.  గత సంవత్సరం పలు మార్లు దాడులకు పాల్పపడిన ఉగ్రవాదులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ సర్జికల్ స్టైక్ చేసి దిమ్మతిరిగేలా చేసింది.  ఈ మద్య పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడితో 40 మంది వీర జవాన్లను పొట్టన బెట్టుకున్నారు.  దాంతో భారత దేశ సైన్యం ఆగ్రహంతో ఊగిపోయింది.  ఏ క్షణం అయినా యుద్దానికి సిద్దం అంటూ ఆవేశ పడుతున్నారు. 
Image result for indian air force attack terrorists
మరోవైపు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పాక్ చర్యలను ఖండిస్తూ భారత సైన్యానికి వీరత్వాన్ని పొగుడుతున్నారు.  తాజాగా పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ సర్టికల్ స్ట్రయిక్ 2 ను చేసింది. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ ఆక్రమిత ప్రదేశాల్లో ఏర్పాడు చేసుకున్న జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
Image result for indian air force attack terrorists
పీఓకేలో బాలాకోట్ కేంద్రంగా ఈ దాడులు నిర్వహించారు. కార్గిల్ యుద్ధ విమానం తర్వాత ఈ దాడులు చేయడం ఇదే తొలిసారి. భారత్ విమానాలు ఎల్ఓసీ దాటినట్లు ఇప్పటికే పాక్ ప్రకటించింది. ఈదాడుల్లో అతిపెద్ద జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరం ధ్వంసమయింది.   పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ దాడులను భారత్ వైమానిక దళం నిర్వహించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: