గత కొంత కాలంగా భారత దేశ సహనాన్ని పరీక్షిస్తున్న ఉగ్రవాదులకు దెబ్బకు దెయ్యం వదిలేలా చర్యలకు పాల్పపడింది సైన్యం. గత సంవత్సరం పలు మార్లు దాడులకు పాల్పపడిన ఉగ్రవాదులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ సర్జికల్ స్టైక్ చేసి దిమ్మతిరిగేలా చేసింది. ఈ మద్య పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడితో 40 మంది వీర జవాన్లను పొట్టన బెట్టుకున్నారు. దాంతో భారత దేశ సైన్యం ఆగ్రహంతో ఊగిపోయింది. ఏ క్షణం అయినా యుద్దానికి సిద్దం అంటూ ఆవేశ పడుతున్నారు.
మరోవైపు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పాక్ చర్యలను ఖండిస్తూ భారత సైన్యానికి వీరత్వాన్ని పొగుడుతున్నారు. తాజాగా పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ సర్టికల్ స్ట్రయిక్ 2 ను చేసింది. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ ఆక్రమిత ప్రదేశాల్లో ఏర్పాడు చేసుకున్న జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
పీఓకేలో బాలాకోట్ కేంద్రంగా ఈ దాడులు నిర్వహించారు. కార్గిల్ యుద్ధ విమానం తర్వాత ఈ దాడులు చేయడం ఇదే తొలిసారి. భారత్ విమానాలు ఎల్ఓసీ దాటినట్లు ఇప్పటికే పాక్ ప్రకటించింది. ఈదాడుల్లో అతిపెద్ద జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరం ధ్వంసమయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ దాడులను భారత్ వైమానిక దళం నిర్వహించింది.