ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో నేతల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు కి అసహనం పెరిగిపోతున్నట్లుగా ఉంది.

Related image

ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పై పరుషమైన ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వస్తే ఎపి బీహారు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారట.టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారంటూ వచ్చిన లీక్ లో ఆయన వైసిపిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Image result for chandrababu

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్యాన్ స్విచ్ తెలంగాణలో, ప్యూజ్ డిల్లీలో ఉందని ఆయన అన్నారు.టిఆర్ఎస్ ఎపికి కార్యకర్తలను పంపుతానంటోందని, రాష్ట్రానికి అన్యాయం చేసినవారితో జగన్ అంటకాగుతున్నారని, దీనికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.

Image result for chandrababu jaagan

వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒంగోలులో, చిత్తూరు, దెందులూరులో వైసిపి అలా చేసిందిన ఆయన అంటున్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కుమ్మక్కు రాజకీయాలకు ఏపీ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.   



మరింత సమాచారం తెలుసుకోండి: