మంగళవారం తెల్లవారుజామన భారత వైమానిక దాడులు అనంతరం పాకిస్థాన్ కూడా భారత్పై దాడులకు తిరిగి ప్రయత్నిస్తోంది. అయితే భారత సైన్యం పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇరుదేశాల పరస్పర దాడుల్లో పాకిస్థాన్కు చెందిన f-16 ఫైటర్ జెట్ను నేలమట్టం చేశామన్నారు. అయితే ఈ దాడుల్లో మిగ్-21 విమానం పాక్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో మిగ్ -21 భారత పైలట్ తప్పిపోయాడని భారత సైన్యం ప్రకటించింది.
వైమానిక దాడుల నేపథ్యంలో దూర ప్రయాణాల విషయంలో, ముఖ్యంగా విమాన ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని భారతీయులను కోరుతోంది భారత వైమానికదళం. భారత్-పాక్ యుద్ధమేఘాల నేపథ్యంలో భారతీయులు విమాన ప్రయాణాల విషయంలో వాయిదా వేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.