ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో ప్రధాన పార్టీల రాజకీయ అధ్యక్షులు పటిక ప్రచారపర్వంలో ముందుకు దూసుకుపోతున్నారు.

Image result for jagan chandrababu

ఇదే క్రమంలో రాష్ట్రంలో అన్ని సర్వేలలో వైసీపీ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న చాలామంది రాజకీయ నేతలు వైసీపీ పార్టీ కండువా కప్పుకుంటున్నారు.

Image result for jagan chandrababu

ముఖ్యంగా ఇటీవల వైసీపీ పార్టీలో చేరుతున్న నేతలను చూసి చంద్రబాబు ఓర్చుకోలేక పోతున్నారని విజయవాడ ప్రాంతానికి చెందిన మల్లాది విష్ణు కామెంట్ చేశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతసేపు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై ఏడవడం తప్ప మరొకటి చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

Image result for jagan chandrababu

చంద్రబాబు ఎందుకు రహస్యంగా హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారో, అమరావతిలో ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ఆయన అన్నారు. అమరావతిలో సొంత ఇల్లు, ప్రధాన కార్యాలయం నిర్మించుకున్న పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అని ఆయన చెప్పారు. రోజూ టెలికాన్ఫరెన్స్ పేరుతో జగన్ పై పిచ్చి ఆరోపణలు చేయడం, చివరికి నటుడు నాగార్జున కలిస్తే కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విష్ణు మండిపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: