పాక్ సైన్యం చేతికి చిక్కివారి అదుపులో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు విముక్తి లభించింది. అంతర్జాతీయ సమాజంతోపాటు భారత ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో అభినందన్ ను విడుదల చేయక తప్పని పరిస్థితుల్లో పాక్ ఇరుక్కుంది. దీంతో పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, అభినందన్ను విడుదల చేస్తున్నట్లు పార్లమెంట్లో ప్రకటించారు. ఈ చర్యను ఇరుదేశాల మద్య శాంతిచర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందనడానికి తొలిమెట్టు గా ఇమ్రాన్ ఖాన్ అభివర్ణించారు.
అభినందన్ వర్ధమాన్ విషయమై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు తాను నిన్న బుధవారం ప్రయత్నించానని అయితే ఆయన అందు బాటు లోకి రాలేదని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ప్రమాదవశాత్తూ పాకిస్తాన్ భూభాగం లోకి ప్రవేశించిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్ క్షేమసమాచారంపై భారత ప్రభుత్వంతో పాటు 125 కోట్ల భారతీయులు ఆందోళనగా ఉన్నారు.
"పైకి ఏం పర్లేదు!" అంటున్నా, "పాక్ సైన్యం ఆయనను ఏం చేస్తుందో? గత అనుభవాల దృష్ట్యా భారత్ కంగారు పడటానికి అర్ధం ఉంది. ఈ నేపథ్యంలో తమ నిర్బంధంలో ఉన్న అభినందన్ వర్థమాన్ క్షేమంగా ఉన్నారంటూ పాక్ విదేశాంగ మంత్రి - షా మహ్మద్ ఖురేషి - ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన రావడం గుర్తించవలసిన విషయం. ఈ వార్త తెలియడంతో ప్రభుత్వంతో పాటు భారత సైన్యం, ప్రజలు హర్షం వ్యక్తం చేసుకుంటున్నారు.
భారత్ పై వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో మన దేశానికి చెందిన మిగ్—21విమానం కూలి పోయింది. ఈ ప్రమాదంలో పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన భారత సింహం -పైలట్ అభినందన్ వర్ధమాన్ పై ఆ దేశ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
శత్రు దేశానికి పట్టుబడతానని, ప్రాణాలు పోయే విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంటానని తెలిసి కూడా భయ భ్రాంతులకు లోను కాకుండా అతను కర్తవ్యం మరువ లేదని పేర్కొంది. మంటల్లో పడి కాలి బూడిదయ్యే పరిస్థితుల నుంచి బయట పడిన అభినందన్ తెలివిగా వ్యవహరించి తన వద్ద ఉన్న కీలక డాక్యుమెంట్లను మాయం చేశాడని కొనియాడింది.
కాగా, మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో దిగిన అభినందన్ తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్కు చెందిన డాన్ వార్తా పత్రిక కథనం ప్రకారం-నడుముకు పిస్టల్ తో ఉన్నoka పైలట్ పాక్ భూభాగంలో దిగాడు. అక్కడున్నకొందరు యువకుల్ని‘ఇది ఇండియానా? పాకిస్తానా?’ అని అడిగాడు. దాంతో అక్కడున్న యువకుల్లో ఒకరు చాకచక్యంగా ఇది ఇండియా అని బదులిచ్చాడు. దాంతో ‘భారత్ మాతాకి జై!’ అంటూ అభినందన్ నినాదాలు చేశాడు.
‘నా నడుము విరిగిపోయింది. దాహంగా ఉంది. తాగడానికి మంచినీరు కావాలి’ అని అడిగాడు. అయితే, అక్కడున్న యువకుల్లో కొందరు అభినందన్ భారత నినాదాలు చేయడంతో కోపం పట్టలేకపోయారు. ‘పాకిస్తాన్ జిందాబాద్!’ అంటూ అరిచారు.
విషయం అర్ధమైన అభినందన్ పిస్టల్ బయటకు తీశాడు. దీంతో యువకులు రాళ్లు
పట్టుకుని అతనిపైకి దాడికి యత్నించారు. వారందరినీ గన్తో బెదిరించి గాల్లోకి
కాల్పుడు జరుపుతూ నడుముకు అంత పెద్ద గాయమైనా అతను అరకిలోమీటరు దూరం పరుగెత్తాడు. నీటి
కాలువలో దాక్కుని తన జేబులో ఉన్న కొన్ని పత్రాలను మింగేశాడు. మరికొన్నింటిని
ముక్కలుగా చేసి నీటిలో కలిపేశాడు.
ఇదిలాఉండగా ఫైటర్ జెట్ కూలిపోవడంతో అభినందన్ ప్యారాచూట్ సాయంతో కిందకి దూకేశాడని, ఆ క్రమంలోనే అతను తీవ్రంగా గాయపడి ఉండొచ్చని ‘డాన్ పత్రిక’ అభిప్రాయపడింది. అయితే, పాక్ భూభాగంలో పడిపోయిన అభినందన్ ను తీవ్రంగా కొడుతున్న వీడియో ఒకటి బయటకి రావడంతో తీవ్రం కలకలం రేగింది.
యుద్ద ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తోందని తీవ్ర
విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతో పాక్ మరో వీడియో విడుదల
చేసింది. ఈ వీడియోలో అభినందన్ కాఫీ తాగుతూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ
సందర్భంగా పాకిస్తాన్ జవాన్ల ట్రీట్మెంట్ బాగుందని అభినందన్ తెలిపారు. మీ
లక్ష్యం ఏంటని పాక్ అధికారులు అడిగిన ప్రశ్నకు, జవాబు చెప్పదలచు కోలేదని
పేర్కొన్నారు. ఇక భారత జవాన్ వీరోచితంపై కథనం రాస్తే అక్కడి
పాఠకులు ఆమోదించరని తెలిసి కూడా ‘డాన్ పత్రిక’ కథనాన్ని ప్రచురించడం
గొప్ప విషయమని పలువురు అభినందిస్తున్నారు.