త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఇప్పటికే ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో పార్టీ అధ్యక్షులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎంపిక చేసుకుంటున్నారు.

Related image

ఇప్పటికే కొన్ని చోట్ల అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఫుల్ క్లారిటీ తో ఉండగా మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న వైసిపి కూడా టీడీపీకి కంటే ఒక్కడుగు ముందడుగు లోనే ఉంది. ఈ క్రమంలో ఇటీవల కొన్ని జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేసిన విషయం మనకందరికీ తెలిసినదే.

Image result for jagan

ఇదే క్రమంలో వైసీపీ అధినేత జగన్ కూడా తాజాగా ఒక అడుగు ముందుకు వేస్తూ అభ్యర్థుల ఎంపిక విషయంలో జోరు పెంచుతున్నాడు. రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగబోయే అభ్యర్ధులని వీలైనంత త్వరగా ప్రకటించేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్నారు.

Image result for jagan

ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయి రాబోయే రాజకీయ పరిణామాల గురించి చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మొత్తం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇటీవల స్పష్టం చేశారు. మరిముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే బస్సు యాత్ర కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: