ప్రధాని నరేంద్ర మోడీకు నలుపు రంగుకూ ఏదో సంబంధం ఉన్నట్లుంది. మరీ ముఖ్యంగా ఆయన దక్షిణాది రాష్ట్రాల టూర్ చేపడితే చాలు నల్ల రంగు పోటెత్తిపోతుంది. నల్ల బెలూన్లు, జండాలు, కటౌట్లు ఒకటేమిటి అంతా నలుపుమయంగా ఉంటుంది.


మంత్రుల నిరసన :


విశాఖ నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ టీడీపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు నిరసన నిర్వహించారు. ఈ రోజు విశాఖ జరిగిన ఆందోళనలో అయ్యన్న మాట్లాడుతూ, ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన మోడీ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు.  ప్రత్యేక హోదా ఇవ్వలేదని,రైల్వే జోన్ కూడా సరిగ్గా ప్రకటించలేదని నిప్పులు చెరిగారు. మోడీ సభకు ఎవరైనా వెళ్తే వారు తెలుగు వారు కానేకాదని కూడా అయ్యన్న  కొత్త నిర్వచనం చెప్పారు. మోడీ సభను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు.


కామ్రేడ్స్ కన్నెర్ర :


ఇక మోడీ సభ విశాఖలో నిర్వహించడంపై కామ్రెడ్స్ కన్నెర్ర చేశారు. మోడీకి ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదని సీపీఎం మధు, సీపీఐ రామక్రిష్ణ విమర్శించారు. విశాఖలో ఈ రోజు పెద్ద ఎత్తున వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ప్రజా సంఘాల నాయకులు కూడా గత మూడు రోజులుగా మోడీ మీటింగుపై గరం గరం అవుతున్నారు. మొత్తానికి చూసుకుంటే మోడీ సభ జరగకముందే విశాఖలో సెగ బాగా రాజుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: