జేసి దివాకర్ రెడ్డి ఇతను గురించి చెప్పాల్సిన పనేముంది. ముక్కు సూటిగా మాట్లాడి తన పార్టీ వారినే ముప్పు తిప్పలు పెడతాడు. ఆఖరికి పార్టీ అధినేత చంద్ర బాబు ను కూడా వదిలి పెట్టడు . అయితే జేసి ఇప్పుడు మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఎన్నికల్లో  టీడీపీలో కనీసం 40శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడని జేసీ దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.

Image result for jc diwakar reddy

చంద్రబాబబు పరిస్థితి చూస్తుంటే మరోసారి గెలవడం కష్టమేనట్టు కనిపిస్తోందని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరులో తనకు చాలా అభ్యంతరాలున్నాయని.. టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనివల్లే టీడీపీ ఓడిపోతుందేమోనన్న భయం కలుగుతుందని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. 


ఇక జాతీయ రాజకీయాలపై కూడా జేసీ విశ్లేషించారు. పాకిస్తాన్ పై భారత్ దాడి దరిమిలా సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యిందని.. సరిహద్దుల్లో పరిస్థితులు ఇలాగే ఉంటే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని జేసీ జోస్యం చెప్పారు. నాకు తెలిసి గెలవడం కోసమే మోడీ ఇదంతా చేస్తున్నాడేమోనని జేసీ అనుమానం వ్యక్తం చేశారు. అయితే అనంత పురం లో ఈ సారి జేసి కూడా గెలిచేది కష్టమేనని సర్వేల్లో తేలుతుంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: