పదేళ్ళ ఉమ్మడి రాజధాని నేపధ్యం లోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాన్ని రెండు గా విభజించింది కాంగ్రెస్ పార్టీ. ఈ పరిస్థితి లో హైదరాబాద్ లో ఉండకుండా పాలన మొత్తం అమరావతి లో సాగిస్తాం అంటూ చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. అప్పట్లో ఓటుకు నోటు కేసుకి భయపడి ఆయన అలా చేసారు అనేవాళ్ళు కూడా ఉన్నారు.
ఇప్పటికీ తమకి సంబంధించిన ఏదైనా అంశం జరిగితే రెండు రాష్ట్రాల కీ ఒకటే రాజధాని కదా అని ఆయనే అంటారు.. తమకి వ్యతిరేకంగా జరిగితే మాత్రం మరొకలా మాట్లాడతారు. ఇప్పుడు తాజాగా ఐ టీ గ్రిడ్ ఉద్యోగుల మీద జరుగుతున్న దాడులు, అరస్టు ల క్రమం లో తెలంగాణా పోలీసులు , ఆంధ్రా పోలీసులు అంటూ చంద్రబాబు విభజించి మాట్లాడుతున్నారు ..
ఈ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ చంద్రబాబు తన రెండు నాలుకల ధోరణి చూపిస్తున్నారు అనిపిస్తోంది. ఐటీ ఉద్యోగుల కంపెనీ లో అసలు ఆంధ్ర ప్రదేశ్ ఓటర్ల జాబితా ఉంచడం ఏంటి అనేది అతిపెద్ద ప్రశ్న.
దీన్ని చేధించడం కోసం వైకాపా కంప్లైంట్ మీద ఉమ్మడి రాజధాని పోలీసులు అరస్ట్ లు చేస్తే వాళ్ళు సడన్ గా బాబు గారికి తెలంగాణా పోలీసులు ఐపోయారా అని ప్రశ్నిస్తున్నారు కొందరు.