నలభై సంవత్సరాల అనుభవమున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నాలుగేళ్ళ అనుభవమున్న యువకుడు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సెటైరికల్ గా కామెంట్ల వర్షం కురిపించటం కొనసాగిస్తున్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ తాజాగా మీడియా తో ఇష్టాగోష్టి గా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

తెలంగాణలో తమ పార్టీ టీఆరెస్ ను భూస్తాపితం చేస్తానంటూ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక శక్తులన్నింటిని ఆఖరకు అస్థిత్వం చంపుకొని మహాకూటమి నిర్మించి పోరాడారు చంద్రబాబు నాయుడు. ఇందులో పాపం! లగడపాటి రాజగోపాల్ ను పిచ్చి పూవుగా జనం మద్యలో నిలబెట్టారు. అయినా తెలంగాణా జనంలో నిశ్శబ్ధంగా ఉన్న ఆలోచన లు ఓట్లుగా మార్చి టిఆర్ఎస్ గుద్దేశారు. ఓటుకు నోటు కేసు తరవాత గజనీ మహమ్మద్ లాగా అమరావతి పారిపోయిన చరిత్ర మరో సారి పునరావృతం చేసి చూపారు.

Related image 

 "మేం అభివృద్ధి చేశాం! కాబట్టే మాకు ఓట్లు పడ్డాయి" అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీలో ప్రజలు నారా చంద్రబాబు నాయుడుపై చాలా వ్యతిరేఖతో ఉన్నారని తెలిపారు. ఈ సారి చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ కి బై బై చెప్పాల్సిందే నని వ్యాఖ్యానించారు. "చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం కాదు.. విజయవాడలో బొంగరం కూడా తిప్పలేరు" అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు

 

ఆంధ్ర డేటా ను దొంగిలించి మేం ఏం చేసుకుంటామని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకి అంత భయం ఎందుకు? ప్రైవేట్ వ్యక్తుల మీద దాడి జరిగితే ఎందుకు భయపడు తున్నారు? ఐటీ గ్రిడ్ అనే సంస్థ మీద దాడి జరిగితే "ఏపీ ఐటీ శాఖ" మీద దాడి జరిగినట్లు సృష్టిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు చిల్లర రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

Image result for ktr attack on chandrababu it grid case 

 ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో నేరం ఋజువు అయితే మొదటి ముద్దాయిగా ఏపీ ప్రభుత్వమే నిలబడుతుందని అన్నారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న వాళ్లను తాము బెదిరిస్తున్నామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ, హైదరాబాద్ లో పెద్ద ఆస్తి ఉన్న వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని సంచలనమైన కామెంట్లు చేశారు. ఎన్ టీ ఆర్ మహానాయకుడు సినిమాను మీ ప్రజలే చూడటం లేదు. చంద్రబాబు ప్రధాని నత్రేంద్ర మోడీని చూడమన్నారంటూ ఎద్దేవా చేశారు.

 

ఎన్నికలకు పదిరోజుల ముందు ఏం చేసినా ప్రజల్లో మార్పు రాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విశాఖ రైల్వేజోన్ గురించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలే కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకం కాబోతున్నారని వెల్లడించారు. రాఫెల్ ను ఐదేళ్ల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు కేటీఆర్. మరోవైపు ఈనెల 6వ తేదీ నుండి పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: