ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని రోడ్డు భద్రతా చర్యలు తీసుకున్నా డ్రైవర్ల నిర్లక్ష్యం..మద్యం సేవించి వాహనాలు నడపటం..అత్యంత వేగంగా ప్రయాణించడం రోడ్డు ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. తాజాగా నల్లొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు-టాటా ఏస్ వాహనం ఢీకొని ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఆర్టీసీ బస్సు దేవరకొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.