తాను చాలా అమాయాకుడు. జగన్మోహన్ రెడ్డే దుర్మార్గుడు, కరడుగట్టిన నేరస్ధభావం ఉన్నవాడు. అందుకనే జగన్ తమ పార్టీ నేతలను బెదిరిస్తున్నారు. ఇది చంద్రబాబు మీడియా సమావేశం యొక్క సారంశం. అసలు ఓట్లు తీసేయించటమంటే ఏమిటో కూడా చంద్రబాబుకు తెలీదట. ఓట్లు తీసేయించటమే తెలీదంటే ఇక దొంగఓట్లు చేర్పించటం గురించి మాత్రం ఏం తెలిసుంటుంది ?

 

నియోజకవర్గాల్లో వైసిపి లక్షల్లో ఓట్లు తీయించటం వల్ల టిడిపి వాళ్ళు పోటీ చేయాలంటేనే భయపడుతున్నారట. ఇంత ఆర్గనైజుడుగా క్రైం చేయటమంటే ఏమిటర్ధం ? అంటూ చంద్రబాబు అమాయకంగా మీడియాను అడగటం విచిత్రంగా ఉంది. క్రమినల్ కాబట్టే లక్షల్లో  ప్రజల ఓట్లు తీసేయించాలన్న ఆలోచన వచ్చిందన్నారు.

 

తమ పార్టీ వివరాలను చోరి చేసి ధౌర్జన్యంగా టిఆర్ఎస్ లాక్కుని ఆ సమాచారాన్ని వైసిపికి ఇవ్వటం ఏమిటంటూ జగన్ పై మండిపడ్డారు. వైసిపి కోసం తమ పార్టీ వివరాలను టిఆర్ఎస్ దొంగతనం చేసి పైగా తమపైనే ఎదురుదాడి చేస్తున్నారా ? అంటూ కెసియార్, జగన్ పై మండిపడ్డారు. తమ పార్టీ వివరాలను చోరీ చేసిన వాళ్ళని తాను వదలబోనంటూ శపథం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: