ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ అయిన టీడీపీ నుంచి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు , ఇద్దరు ఎంపీలు పార్టీ మరి వైసీపీ ఖండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పైనే నంద్యాల ఎంపీ సీటు నుంచి బరిలోకి దిగిన ఎస్పీవై రెడ్డి... వైసీపీ మేనియాలోనే నెగ్గేశారు. అయితే ఆ తర్వాత ఎంపీగా లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే... టీడీపీలో చేరిపోయారు.

Image result for spy reddy

నాడు అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ చేసిన బెదిరింపుల కారణంగానే ఎస్పీవై చేసేది లేక అధికార పార్టీలో చేరిపోయారని నాడు వార్తలు వినిపించాయి. అయితే ఇదంతా గతం అనుకుంటే... ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు ముందు తాను సిట్టింగ్ గా ఉన్న నంద్యాల సీటును తనకే ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి... చంద్రబాబును కోరారట. అయితే అందుకు ఓ వింత కండీషన్ పెట్టిన చంద్రబాబు... టికెట్ కావాలంటే... నూ.60 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ చూపించమన్నారట.

Image result for spy reddy

దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఎస్పీవై రెడ్డి... టీడీపీకి రాజీనామా  చేసేందుకు సిద్ధపడ్డారట. ఈ మేరకు ఈ నెల 10న తన కార్యకర్తలతో భేటీ కావాలని  ఆ భేటీలోనే తన భవిష్యత్తు వ్యూహాన్ని ఖరారు చేసుకోవాలని ఆయన గట్టిగానే నిర్ణయించుకున్నారట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీడీపీకి రాజీనామా చేయనున్న ఎస్పీవై రెడ్డి... నేరుగా వైసీపీలోనే చేరతారని తెలుస్తోంది. అయితే గడచిన ఎన్నికల తర్వాత పార్టీకి తాను చేసిన ద్రోహంతో  ఈ దఫా తనకు టికెట్ దక్కకపోవచ్చని ఓ నిర్ధారణకు వచ్చిన ఎస్పీవై.... టికెట్ దక్కకపోయినా... వైసీపీలో చేరితే గౌవరంగానైనా ఉంటుందని భావిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: