ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.  ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు తమ ప్రచారంలో మునిగిపోయారు.  తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని  మాట్లాడుతూ..ఎంతో అద్భుతమైన 'పసుపు-కుంకుమ' పథకం ద్వారా లక్షల మంది మహిళల మనసులను చంద్రబాబునాయుడు గెలుచుకున్నారని..తమ నాయకుడికి తిరిగి సీఎం చేయడం ద్వారా మహిళలు రిటన్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని ఆమె అన్నారు. 

రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని..ఆ నేతలు మహిళలను కించ పరిచే విధంగా ఎన్నో మాటలు అంటున్నారని దుయ్యబట్టారు.  వైఎస్ జగన్ మహిళా ద్రోహని, ఆయనకు తెలుగు ఆడపడుచులు తగిన గుణపాఠం చెప్పనున్నారని ఆయన కోసం చెంపపెట్టులాంటి సమాధానాన్ని సిద్ధం చేసుకున్నారని అన్నారు. 

తెలుగు దేశం పార్టీ మహిళలకు ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చిందని...టీడీపీ మొదటి నుంచి ఆడపడుచులకు ఎంతో గౌరవం ఇస్తుందని అన్నారు. మడన తిప్పడంలో ముందున్న పార్టీ వైసీపీయేన..అందుకే పక్కరాష్ట్ర అధినేతలతో..కేంద్రంలో మోదీతో సంబంధాలు పెట్టుకొని ఏపి అభివృద్దిని అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: