ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్న క్రమంలో ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రజలను బ్యాలెన్స్ చేస్తూ చాణిక్య రాజకీయాన్ని చేస్తున్నారు చంద్రబాబు.
ఒకపక్క ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ వేస్తున్నా కుయుక్తులకు కౌంటర్లు వేస్తూ మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కెసిఆర్ వేస్తున్న వ్యూహాలకు తనదైన శైలిలో చెక్కులు పెడుతున్న చంద్రబాబు...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని మనలను అందుకోవడానికి ఇస్తున్న హామీలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుండగా మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీ కి దడ పుట్టిస్తున్నాయి.
ఇదిలావుండగా తాజాగా ఇటీవల ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలను ఆకట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ త్వరలోనే డ్వాక్రా సంఘాల సభ్యులకు స్మార్ట్ పోన్ లు ఇస్తామని చెప్పారు.
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.భారతదేశానికి కుటుంబ వ్యవస్థ ఓ గొప్ప వరమన్నారు. చాలామంది మహిళల్లో సమర్థ నాయకత్వం ఉందని ఆయన అన్నారు. 98 లక్షల మంది పేద మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, 35,600 గ్రామ సమాఖ్యలు ఉన్నాయని తెలిపారు.కోటి మంది ఆడ బిడ్డలకు ‘పసుపు-కుంకుమ’ ఇస్తున్నట్టు తెలిపారు.