ఈ మద్య కామాంధులు ఎక్కడబడితే అక్కడ యువతులపై, మహిళలపై, చిన్నారులపై లైంగిక, అత్యాచారాలు..హత్యలకు పాల్పపడుతున్నారు.  ఇలాంటి దాడులుపై మహిళా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు ఎన్ని దర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం కఠిన చట్టాలు తీసుకు రావడం లేదు.  నిర్భయ తరహా దాడులు ఇప్పటి వరకు ఎంతో మంది యువతులపై జరుగుతూనే ఉన్నాయి.  సౌదీ దేశాల్లో తరహా కఠిన చట్టాలు లేకపోవడంతో కామాందులు నేరం చేసిన కొంత కాలానికే బయటికి రావడం మరోసారి రెచ్చిపోవడం జరుగుతుంది. 

తాజాగా హైదరాబాద్‌లో దారుణం జరిగింది. పదహారేళ్ల బాలికపై బ్లేడ్లతో తీవ్రంగా దాడి చేసి వివస్త్రను చేసి సెల్‌ఫోన్‌లో నగ్న దృశ్యాలను రికార్డు చేశాడో బాలుడు..ఆ తర్వాత పలుమార్లు బాలికను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ దోమలగూడ మైసమ్మబండకు చెందిన ఓ కారు డ్రైవర్ కుమార్తె పదహారేళ్ల బాలిక ఘట్ కేసర్ లో డిప్లొమో ఫస్టియర్ చదువుతోంది. ఈ నెల 7వ తేది రాత్రి 9.30 నిమిషాలకు ప్రాంతంలో తన స్నేహితురాళి ఇంటికి వెళ్తానని చెప్పి బయటకు వెళ్లిన ఆ బాలిక  ఆమె స్నేహితుడు లోయర్ ట్యాంక్ బండ్ డీబీఆర్ మిల్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి గంజాయి సేవించారు. 

గంజాయి మత్తు తలకెక్కడంతో ఆ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు..యువతిని భయపెట్టి.. బెదిరించి..బ్లేడ్లతో దాడి చేసి ఆమెను నగ్నంగా చేశాడు. శరీరంపై, జననాంగంపై కర్కశంగా గాట్లు పెట్టాడు.  తనను వదిలిపెట్టాలని బాలిక ఎంత బ్రతిమిలాడినా..మరింత రెచ్చిపోయాడు. అతని స్నేహితులు ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించి పైశాచికానందం పొందారు. బాలిక అరుపులు విన్న స్థానికులంతా ఈ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకుని కీచకుడిని పోలీసులకు అప్పగించారు. గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: