రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఐటీ గ్రిడ్ అంశం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు జనాలు. వైకాపా vs టీడీపీ గా జరగబోతున్న 2019 ఎన్నికల విషయం లో పొలిటికల్ హీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజుకుంది.
రాజకీయ వేడిని మరింత టెంపరేచర్ పెంచేస్తూ ఐటీ గ్రిడ్ వ్యవహారం , డేటా చోరీ కేసులు రెండు రాష్ట్రాలనీ కుదిపేస్తూ ఉన్నాయి. ఈ విషయం లో ఎవరి రాజకీయం తో వారు ముందుకు వెళుతున్నారు ఇలాంటి నేపధ్యం లో సామాజిక పరంగా జనాలకి ఎలాంటి మంచి జరుగుతుందో తెలీదు కానీ మీడియా కి మాత్రం బోలెడంత మేత దొరికినట్టు గా అయ్యింది.
రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇన్నాళ్ళూ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను హైదరాబద్ వదిలి వచ్చాను అని చెప్పుకునే చంద్రబాబు ..
ఇప్పుడు మాత్రం రాజకీయ కారణాల రిత్యా నే హైదరాబాద్ వచ్చాను అని నిజం ఒప్పుకోవడం షాకింగ్ అంశం గా చెప్పాలి. అమరావతి మరియూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసమే తాను ఇంత హడావిడి గా హైదరాబాద్ నుంచి వచ్చేసాను అని పదే పదే చెబుతూ ఉంటారు ఆయన అలాంటిది ఫైనల్ గా తన మనసులో మాటని చంద్రబాబు బయట పెట్టినట్టు గా అయ్యింది.