రాబోయే ఎన్నికల్లో మంత్రి
దేవినేని ఉమా మహేశ్వరరావు చెమటలు పట్టిస్తున్నట్లే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది మద్దతుదారులకు
మంత్రి పోకడ నచ్చటం లేదు. అదే సమయంలో వైసిపి మైలవరం అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న
వసంత కృష్ణప్రసాద్ పనితీరుతో మంత్రి ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. నియోజకవర్గంలోని
మంత్రి వ్యతరేకులందరినీ వసంత కలుపుకుని వెళుతున్నారు. ఈ సమయంలోనే మంత్రి సోదరుడు
దేవినేని చంద్రశేఖర్ వైసిపిలో చేరారు.
సోదరుడి ఆగడాలు తట్టుకోలేకే తాను టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరినట్లు చంద్రశేఖర్ చెప్పారు. జిల్లాలో ప్రత్యేకించి నియోజకవర్గంలో మంత్రి అరాచకాలు బాగా పెరిగిపోయాయన్నారు. అవినీతి కూడా విచ్చలవిడిగా పెరిగిపోయిందంటూ సోదరుడిపై మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి విజయమే లక్ష్యంగా పనిచేస్తానని జగన్ కు మాటిచ్చారు.
స్వయానా సోదరుడే మంత్రిపై మండిపోతు వైసిపిలో చేరటం టిడిపిలో సంచలనంగా మారింది. లోటస్ పాండ్ లోని నివాసంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసిపి కండువా కప్పుకున్నారు. ఇప్పటికే మంత్రి పోకడలు నచ్చని చాలామంది గుర్రుగా ఉన్నారు. అంతర్లీనంగా వైసిపి నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్ధితుల్లో మంత్రి సోదరుడే వైసిపిలో చేరటంతో ఇంకా చాలామంది వైసిపిలోకి వచ్చేస్తారని భావిస్తున్నారు.