కర్నూలు జిల్లా పత్తికొండలో లో ఎన్నికల జోరు ఇప్పటికే మొదలైపోయింది. పత్తికొండ నియోజకవర్గం లో టిడిపి మరియు వైయస్ఆర్సీపీ ఇరు పార్టీల అభ్యర్థులకు మంచి పట్టు ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి నారాయణ రెడ్డి సతీమణి కంగిటి శ్రీదేవి పోటీ చేయనున్నారు .టిడిపి తరఫునుంచి కేఈ కృష్ణమూర్తి నిలబడుతున్నారు లేదా ఆయన కొడుకు శ్యామ్ బాబు కి పట్టం కట్టనున్నారా... అనే విషయం ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే గానికి కేఈ కృష్ణమూర్తి తన సత్తా చాటుకున్నారు కానీ ఇక్కడ ఫ్యాక్షనిజం అనే మంటలు ఎప్పుడు చెలరేగుతూనే ఉంటాయి. నారాయణ రెడ్డి ని కృష్ణమూర్తి కొడుకే హత్య చేయించాడని ఇక్కడ అంతా అనుకుంటూ ఉంటారు .ఈ నెపం తోనే వాళ్లకు ధీటుగా శ్రీదేవి బరిలో దిగారు. ఎలాగైనా వారి మీద విజయం సాధించాలని కసితో ఉన్నారు. వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులే కాక బద్ద శత్రువులు కావడంతో ఇక్కడి రాజకీయ వాతావరణం భగ్గుమంటుంది. దీంతో గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి శ్రీదేవికి దగ్గరి బంధువు. ఆయన పత్తికొండలో గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు ఇదే జరిగితే శ్రీదేవి కి రావలసిన ఓట్లు చీలే అవకాశం ఉన్నాయి. ఏది జరిగినా శ్రీదేవి గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు వినికిడి.