మనకందరికీ లలిత జ్యుయలర్స్ అధినేత గుండు బాసు గుర్తే ఉండే ఉంటుంది. అతని యాడ్ అయితే బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు అదే యాడ్ అలీ విషయంలో సర్క్యూలేట్ అవుతుంది. గుండుబాస్ తరహాలోనే ఏపీలోని మూడు ప్రధాన పార్టీలతో మంతనాలు సాగించిన అలీ... చివరకు విపక్ష వైసీపీలో చేరిపోయారు. నిన్న ఆయన లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిపోగానే... గుండు బాస్ చెప్పిన మాటలను అలీ వ్యవహరించిన తీరును పోలుస్తూ... ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ ఆసక్తికర కథనాన్ని ప్రసారం చేసింది.


అలీ మీద ఎదురుదాడికి దిగుతున్న టీడీపీ ..!

ఇప్పుడు క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోగా... అలీ పొలిటికల్ ఎంట్రీపై జోకుల మీద జోకులు పేలిపోతున్నాయి. తన బిజినెస్ను విస్తరించుకునేందకు గుండు బాస్ వినిపించిన మాటల తరహాలోనే.. అలీ కూడా తన లక్ష్యాలను సాధించుకునేందుకు ఏ పార్టీ అయితే బాగుంటుందన్న విషయాన్ని తేల్చుకునేందుకు ఏకంగా రాష్ట్రంలోని మూడు కీలక పార్టీలతో చెట్టాలేసుకుని తిరిగారు.


అలీ మీద ఎదురుదాడికి దిగుతున్న టీడీపీ ..!

తొలుత వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయిన అలీ... ఆ తర్వాత టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితోనే భేటీ అయ్యారు. చాలాకాలంగా టీడీపీతోనే కొనసాగుతూ వస్తున్న అలీ... చంద్రబాబుతో కీలకమైన ఎన్నికలకు ముందు ఏకంగా మూడు - నాలుగు సార్లు కలిశారు. ఆ తర్వాత తన మిత్రుడు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. ఈ క్రమంలో అలీ ఏ పార్టీలో చేరతారన్నఅంశంపై  పెద్ద ఎత్తున ఊహాగానాలకు తెర లేవగా... అలీ మాత్రం నిన్న వైసీపీలో చేరిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: