వైసీపీలోకి జోరుగా టీడీపీ నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. కొన్నాళ్లుగా వీరు టీడీపీ, వైసీపీ మధ్య ఊగిసలాడారు. చంద్రబాబును కూడా కలిశారు. చివరకు వైసీపీలో చేరారు.

thota narasimham wife కోసం చిత్ర ఫలితం



వైసీపీలో చేరుతూ ఎంపీ భార్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అవేమిటంటే.. 
గత 15 సంవత్సరాలుగా పార్టీకి, ప్రజలకు నా భర్త  సేవ చేశారు. పార్టీలో జిల్లాలో ఉన్న నాయకులెవరు నరసింహం గారికి మర్యాద ఇవ్వలేదు. వారం క్రితం ముఖ్యమంత్రి కబురు పంపారు. ఆయనకు అనారోగ్యం కారణంగా తర్వాత వచ్చి కలుస్తామని పార్టీలో ఉన్న ఇద్దరు పెద్దలకు చెప్పడం జరిగింది.

సంబంధిత చిత్రం

అప్పటినుండి ఇప్పటివరకు ఆరోగ్యం ఎలా ఉందిఅని అడిగినవారు లేరు. జిల్లాలో ఇక్కడ, మమ్మల్ని అక్కడ నాన్నగారి కుటుంబాన్ని రాజప్ప గారు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చనిపోయిన నాన్నగారిని కూడా వాడు, వీడు అని అసభ్య పదజాలంతో  సంభోదించారు. 
chandrababau కోసం చిత్ర ఫలితం

మా నాన్నగారు, నా భర్త నేర్పిన సంస్కారం వల్ల ఆయనను ఎప్పుడు అసభ్య పదజాలంతో దూషించలేదు. ఒకే పార్టీ లో ఉండడం వల్ల సహించాం. మేము ఎక్కడ ఎదిగిపోతామో అని, నా భర్తకు సముచిత స్థానం ఇవ్వకుండా, కనీసం ఫోన్ కాల్ కూడా చెయ్యలేదు. చంద్రబాబు గారిని గాని,లోకేష్ ని గాని తప్పు పట్టడం లేదు... ఇదీ వాణీగారి వ్యథ. 



మరింత సమాచారం తెలుసుకోండి: