ఆంధ్ర ప్రదేశ్ లేడీ మినిస్టర్ , చంద్రబాబు కి సన్నిహిత వ్యక్తి ఐన పరిటాల సునీత సంచలన నిర్ణయం తీసుకునే దిశగా సాగుతున్నారు అని తెలుస్తోంది.



పొలిటికల్ గా రానున్న రోజుల్లో తన కొడుకు పరిటాల శ్రీరాం ని ఎమ్మెల్యే గా నిలబెట్టాలి అని చూస్తున్న ఆమె ప్రస్తుతం ఒకే ఫామిలీ కి రెండు టికెట్లు అడుగుతున్నారు.



తనకి ఎప్పుడూ ఇచ్చే ఎమ్మెల్యే టికెట్ తో పాటు తన కొడుకుని కూడా ఈ ఎన్నికల్లో రంగం లోకి దింపే ఆలోచనలో ఉన్న ఆమె అనంతపురం జిల్లాలో ఎక్కడో ఒక చోట శ్రీరాం కి బీ ఫారం ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి చంద్రబాబు సుముఖంగా ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.



అనేక కారణాల వలన ఏ కుటుంబానికీ రెండు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు సో అవసరం అయితే పరిటాల సునీత పోటీ నుంచి తప్పుకుని తన స్థానాన్ని తన కొడుకు కి ఇచ్చే ఆలోచన చేస్తున్నారు.



దీనిమీద చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి . తన ప్రాంతం లో తన కొడుకుని దింపాలి అని తన భర్త పరిటాల రవి అభిమానులు కూడా ఎప్పటినుంచో కోరుతూ ఉండడం తో ఆమె ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: