ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ బాబుకు అసహనం పెరుగుతున్నట్టుంది. అతని విమర్శల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ కు ఓటేస్తే మరణ శాసనమే అని మాట్లాడుతున్నారు. అదేదో జగన్ రాక్షసుడు మాదిరిగా చిత్రీకరిస్తున్నారు. అంటే ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ బ్యాచ్ తప్ప మిగతా పార్టీలన్నీని ఇలాగే మాట్లాడటం బాబుకు కొత్తేమి కాదులే. ఇంకా ఏమన్నారంటే, జ‌గ‌న్‌-మోదీ-కేసీఆర్ క‌లిసి త న పై కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు.

జ‌న‌సేన‌తో పొత్తు పై ఇలా..

జ‌గ‌న్ కేసుల విష‌యంలో మోదీ కాపాడుతున్నార‌న్నారు. త‌న‌ను ఇబ్బంది పెట్టేందుకే తొలి విడ‌త లోనే ఏపి ఎన్నిక‌లు పెట్టార‌న్నారు. మోదీని చౌకీదార్ కాదు..చోర కీ దార్ అన్నారు. పికె ను బీహారీ డెకాయిట్ గా పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్‌కు ఓటేస్తే మార్పు కాదు.. మరణశాసనమే అన్నారు. జగన్‌ లాంటి వారందరికీ కాపలాదారు మహానాయకుడు కేసీఆర్‌ అన్నారు.

Image result for chandra babu

ఏపీ డీజీపీ ఇంటిని అడ్డగోలుగా కూలదోయాలని కేసీఆర్‌ ప్రయత్నం చేశారని.. మరి జగన్‌ దోచిన 11 ఎకరాల విషయంలో ఎందుకు స్పందించలేదని ప్ర‌శ్నించారు. మోదీ, జగన్‌తో కేసీఆర్‌ లాలూచీకి ఇదే నిదర్శనమన్నారు. కేసీఆర్‌..రాష్ట్రాన్ని కుక్కలు చింపినవిస్తరి చేయాలనుకుంటున్నారా అని ప్ర‌శ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని జ‌గ‌న్ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ జీవితం అడ్డదారి, వైసీపీది చెడుదారి అని వివరించారు. చట్టంలో ఎన్ని నేరాలు ఉన్నాయో జగన్‌ అన్నీ చేశారన్నారు. జగన్‌ ఇప్పటి వరకు ఆర్థిక నేరాలే చేశారని, కానీ ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త నేరాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇంతటి దివాళాకోరు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: