ఏపీలో చంద్రబాబు మళ్లీ గెలిస్తే ఏమవుతుంది.. అభివృద్ధి పరుగులు పెడుతుంది.. సంక్షేమపథకాలు ఇంకా గొప్పగా అమలు చేస్తాం.. ఇవీ టీడీపీ నేతలు బయటకు చెబుతున్న మాటలు. కానీ అసలు కథ వేరేగా ఉన్నట్టుంది.. మళ్లీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలను అంతమొందించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారా.. 



ఈ వీడియో చూస్తే అలాగే ఉంది.. మరి.. ఎన్నికల కౌంటింగ్ పూర్తవగానే ప్రత్యర్థులను నరుక్కుంటూ పోదామంటూ ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి చెప్పిన మాటల వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. సూరి ఆడియో టేపు ఇప్పుడు సంచలనంగా మారింది. 



వరదాపురం సూరిపై అసమ్మతితో ఉన్న టీడీపీ నేతలే ఈ ఆడియో టేపులను బయటపెట్టడం విశేషం. కీలకమైన కార్యకర్తలతో సూరి మాట్లాడుతున్న ఈ ఆడియో టేపులో ఆందోళన కలిగించే అంశాలున్నాయి.చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితే మనకు తిరుగుండదని కార్యకర్తలతో సూరి వ్యాఖ్యానించారు.



 కౌంటింగ్ పూర్తయిన క్షణం నుంచే ప్రత్యర్థులను నరుకుదాం.. చంపేద్దామంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే. ప్రత్యర్థులను చంపుతుంటే అడ్డురాకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ముందే ఆదేశిస్తామని టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తిరిగి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రత్యర్థులందరినీ అంతమొందిద్దామంటూ కార్యకర్తలకు సూరి సూచించారు. మరి ఎన్నికలకు ముందే టీడీపీ నేతల జోరు ఇలా ఉంటే.. మళ్లీ చంద్రబాబు సీఎం అయితే పరిస్థితి ఏంటో అని జనం భయాందోళనకు గురవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: