జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ త‌రఫున బ‌రిలో దిగే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. అధికార తెలుగుదేశం పార్టీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ త‌మ నేత‌ల పేర్ల వెల్ల‌డిలో జాప్యం చేస్తున్న‌ప్ప‌టికీ...జ‌న‌సేనాని త‌మ గెలుపు గుర్రాల పేర్ల‌ను వెల్ల‌డించారు. త‌ద్వారా జ‌న‌సేన‌ ఆవిర్భావ దినోత్స‌వం రోజే పార్టీ నేత‌ల్లో కొత్త జోష్ నింపారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు చ‌ర్చ‌ల్లో మునిగితేలుతుండ‌గా...ప‌వ‌న్ మాత్రం త‌మ అభ్య‌ర్థుల పేర్లు ప్ర‌క‌టించి ప్ర‌చార ప‌ర్వం కోసం వారికి త‌గు స‌మ‌యం కేటాయించారు.

స‌మీక‌ర‌ణాలే ఆధారంగా..

జ‌న‌సేన పార్టీ తరఫున బ‌రిలోకి దిగ‌నున్న‌ అసెంబ్లీ అభ్య‌ర్థుల తొలి జాబితాను ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బుధ‌వారం రాత్రి మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో అభ్య‌ర్థుల‌తో మ‌రోసారి ముఖాముఖి మాట్లాడిన త‌రవాత శాసనసభకు 32 మంది పేర్ల‌ను, లోక్ సభకు  నలుగురి పేర్ల‌ను  ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఖ‌రారు చేశారు. తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్లో 8 మంది జనసేన పార్టీకి కొత్తవారు.
 
జ‌న‌సేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలోని పేర్లు ఇవి.
లోక్‌సభ అభ్యర్థులు:
1. అమ‌లాపురం- డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌
2. రాజ‌మండ్రి-  డాక్ట‌ర్  ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌
3. విశాఖ‌ప‌ట్నం-  గేదెల శ్రీనుబాబు
4. అన‌కాప‌ల్లి-   చింత‌ల పార్థసారధి
శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు:
1. య‌ల‌మంచిలి-  సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌
2. పాయ‌క‌రావుపేట-  న‌క్కా రాజ‌బాబు
3. పాడేరు -  ప‌సుపులేటి బాల‌రాజు
4. రాజాం- డాక్ట‌ర్ ముచ్చా శ్రీనివాస‌రావు
5.శ్రీకాకుళం- కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
6. ప‌లాస‌-  కోత పూర్ణ‌చంద్ర‌రావు
7. ఎచ్చెర్ల‌-  బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)
8. నెల్లిమ‌ర్ల‌- లోకం నాగ‌మాధ‌వి
9.  తుని-  రాజా అశోక్‌బాబు
10. రాజ‌మండ్రి రూరల్-  కందుల దుర్గేష్‌
11. రాజోలు- రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
12. పి.గ‌న్న‌వ‌రం- పాముల రాజేశ్వ‌రి
13. కాకినాడ సిటీ-  ముత్తా శ‌శిధ‌ర్‌
14. అన‌ప‌ర్తి-  రేలంగి నాగేశ్వ‌ర‌రావు
15. ముమ్మిడివ‌రం-  పితాని బాల‌కృష్ణ‌
16. మండ‌పేట‌-  వేగుళ్ల లీలాకృష్ణ‌
17. తాడేప‌ల్లిగూడెం-  బొలిశెట్టి శ్రీనివాస్‌
18. ఉంగుటూరు- న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
19. ఏలూరు- రెడ్డి అప్ప‌ల‌నాయుడు
20. తెనాలి-  నాదెండ్ల మ‌నోహ‌ర్‌
21. గుంటూరు వెస్ట్‌ - తోట చంద్ర‌శేఖ‌ర్‌
22. ప‌త్తిపాడు- రావెల కిషోర్‌బాబు
23. వేమూరు- డాక్ట‌ర్ ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
24. న‌ర‌స‌రావుపేట‌-  స‌య్య‌ద్‌ జిలానీ
25. కావ‌లి-  ప‌సుపులేటి సుధాక‌ర్‌
26. నెల్లూరు రూర‌ల్‌-  చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
27. ఆదోని-  మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)
28. ధ‌ర్మ‌వ‌రం- మ‌ధుసూద‌న్‌రెడ్డి
29.రాజంపేట‌- ప‌త్తిపాటి కుసుమ‌కుమారి 
30. రైల్వే కోడూరు- డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
31. పుంగ‌నూరు-  బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్
32. మ‌చిలీప‌ట్నం-  బండి రామ‌కృష్ణ‌ 


నేరుగా కార్యాలయానికి వచ్చి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని దరఖాస్తులు ఇచ్చినవారు. వీరి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి.. ప్రజా సేవ చేయాలనే వారి సంకల్పాన్ని గ్రహించి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి పోటీకి అవకాశాన్ని పవన్ కల్యాణ్  కల్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: