రాజకీయాల్లో ఒక్కొకసారి చక్రం తిప్పినవారు పుటుక్కున మాయం అవుతూ ఉంటారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం లో ఒక వెలుగు వెలిగిన కేవీ పీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది ఎవ్వరికీ అర్ధం కాకుండా ఉంది.


కాంగ్రెస్ పార్టీ ని అంటిపెట్టుకుని ఉన్న కేవీపీ ఈ ఎన్నికల్లో తన స్టాండ్ ఏంటో చెప్పడం లేదు. చంద్రబాబు తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు బాబు కి వ్యతిరేకంగా తన నియోజికవర్గం లో నిలబడతారా లేదా అనేది అర్ధం కాకుండా పోయింది .



రాజ్యసభ లో సేవ్ ఆంధ్ర ప్రదేశ్ పేరుతో తను ఉద్యమిస్తున్నా అనీ రాష్ట్ర అభివృద్ధి , శ్రేయస్సు కోసం రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం పణంగా పెట్టాను అనీ చెబుతూ ఉంటారు ఆయన.



వై ఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో వై ఎస్ ఆత్మ గా పిలవబడిన కేవీపీ ఇప్పుడు 2019 ఎన్నికల ముఖ చిత్రం లో అసలు ఎక్కడా కనిపించకుండా పోవడం వెనక కారణాలు ఏంటో అర్ధం కావడం లేదు అంటున్నారు విశ్లేషకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: