తెలుగుదేశం పార్టీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. గురువారం రోజంతా కసరత్తు చేసిన చంద్రబాబు అర్థరాత్రి జాబితా విడుదల చేశారు. తొలిజాబితాలో 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 49 స్థానాలు పెండింగ్లో పెట్టారు.
తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. వీటిలో 16 స్థానాలను చంద్రబాబు ఖరారు చేశారు. మరో 3 స్థానాలు పెండింగ్ లో ఉంచారు. పిఠాపురం, అమలాపురం, రంపచోడవరం ఇంకా ప్రకటించలేదు.
సామాజిక వర్గాలవారీగా చూస్తే బీసీలకు 5 స్థానాలు కేటాయించారు. ఓసీలకు 9 స్థానాల్లో అవకాశం ఇచ్చారు. ఎస్సీలకు 2 స్థానాలు కేటాంచారు. మరో మూడు పెండింగ్ లో ఉన్నాయి.
ఇదిగో టీడీపీ ఈస్ట్ గోదావరి జాబితా..
01. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు.
02. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ.
03. పెద్దాపురం- చినరాజప్ప.
04. తుని- యనమల కృష్ణుడు.
05. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు.
06. పత్తిపాడు- వరుపుల రాజా
07. పి.గన్నవరం -స్టాలిన్ బాబు
08. రాజానగరం - పెందుర్తి వెంకటేష్
09. రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
10. అనపర్తి -రామకృష్ణరెడ్డి
11. రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
12. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు
13. కొత్తపేట- బండారు సత్యానందరావు
14. ముమిడివరం -దాట్ల సుబ్బరాజు.
15. రాజమండ్రి అర్బన్ -ఆదిరెడ్డి భవానీ
16. మండపేట - జోగేశ్వరరావు
పెండింగ్:
17. పిఠాపురం
18. అమలాపురం
19. రంపచోడవరం