ఎన్నికల సమయంలో దగ్గరకొస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ ఆరోపణలు పదునెక్కుతున్నాయి. తాజాగా వైసీపీ నేత ఒకరు తమకు బీజేపీతో ఉన్న అండర్ స్టాండింగ్ గురించి టైమ్స్ నౌ ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో లూజ్ టాక్ చేస్తూ దొరికిపోయారు. ఈ అవకాశాన్ని టీడీపీ రచ్చ రచ్చ చేస్తోంది.
ఐతే.. ఇక్కడే ఓ లాజిక్ టీడీపీ నాయకులు మిస్సవుతున్నారు. వైసీపీ నేతలు నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. అధికారికంగా అవగాహన కూడా లేదు. కాకపోతే జగన్ బీజేపీతో సాఫ్ట్ కార్నర్ లో ఉన్న మాట వాస్తవమే. కానీ అంతమాత్రానికే వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందా.
ఒక వేళ బీజేపీతో అవగాహన, స్నేహం ఉన్నందుకే వైసీపీ అడ్రస్ గల్లంతయితే మరి టీడీపీ సంగతి ఏంటి.. గత ఎన్నికల్లో ఏకంగా టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత నాలుగున్నరేళ్ల పాటు కాపురం చేసింది కదా. తమ పచ్చని కాపురానికి పండంటి బిడ్డల్లా ప్రత్యేక ప్యాకేజీ సంపాదించానని చెప్పారు కదా.
మరి ఈ బీజేపీతో టీడీపీ కాపురాన్ని జనం ఎలా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చివరి ఏడాదిలో విడాకులు చేసినంత మాత్రాన... ఆ పచ్చని సంసారాన్ని జనం అంత సులభంగా మర్చిపోతారా.. అందుకు తగిన మూల్యం తమ ఓట్ల రూపంలో చూపించరా.. చూడాలి.. మరి జనం తీర్పు ఎలా ఉంటుందో.. ఇది ఏపీ ఓటరు విజ్ఞతకే విషమ పరీక్ష.