కే ఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు.. వచ్చే ఎన్నికల్లో తనదే అధికారం అని చెప్పినవాడు.. 150 పైగా స్థానాల్లో ప్రజాశాంతి అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమాగా చెప్పినవాడు.. ఒక్కసారి చాన్స్ ఇస్తే.. ఏపీ రూపురేఖలే మార్చేస్తానన్నవాడు.. 

KA PAUL ELECTIONS కోసం చిత్ర ఫలితం


మరి ఇప్పుడు ఆ కే ఏ పాల్ ఎక్కడా కనిపించడంలేదు. ఎన్నికలకు ముందు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు నానా హడావిడి పడుతున్నాయి. టికెట్లు ఎవరికి ఇవ్వాలో అర్థంకాక జుట్టుపీక్కుంటున్నాయి. ఇప్పటికే జనసేన, టీడీపీ ఫస్ట్ లిస్టు ప్రకటించేశాయి. 

సంబంధిత చిత్రం

ఇక వైసీపీ తన పార్టీలోకి వచ్చే వారిని రిసీవ్ చేసుకోవడానికే వైఎస్ జగన్‌కు సమయం సరిపోవడం లేదు. ఈ పార్టీల సంగతి ఇలా ఉంటే.. సునామీ సృష్టిస్తానన్న కేఏ పాల్ మాత్రం పత్తా లేకుండా పోయారు. ఆ పార్టీలోకి వలసలు లేవు. చేరికలు లేవు.

సంబంధిత చిత్రం


చివరకు పార్టీ కార్యక్రమాలు కూడా లేవు. మరి ఇంతకీ టికెట్లు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు. మొన్నామధ్య హెలికాప్టర్ గుర్తు కోసం నానా రచ్చ చేశారు. చివరకు సాధించేశానన్నారు. మళ్లీ సందడి లేదు. ఇలాగైతే ఎలా పాల్.. పాపం.. ఆయన 2014 తరహాలోనే మళ్లీ పోటీ నుంచి విరమించుకుంటారేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: