రాజంపేట నియోజకవర్గం లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి 2014లో టీడీపీ పార్టీ నుంచి గెలుపొంది, ఈ సారి ఎన్నికల కు మాత్రం వైఎస్సార్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం టీడీపీ కి తీవ్రమైన దెబ్బే. ఇలాంటి సమయంలో చంద్రబాబు గారికి కొత్త అభ్యర్థి నిలపెట్టడనికి కసరత్తులు చేయాల్సి వచ్చింది.ఈ నియోజకవర్గం నుంచి చెంగల్ రాయుడు ను బరిలోకి దించనున్నారు. అయితే పోటీ మాత్రం గట్టిగా ఉండదనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే కొత్తగా జనసేన పార్టీ నుంచి పత్తిపాటి కుసుమ కుమారిని రంగంలోకి దించారు. పెద్దగా పోటీ లేకపోయినా రావాల్సిన ఓట్లు చిలుతాయనే భయం మాత్రం అందరి లో కనిపిస్తుంది. మల్లికార్జున రెడ్డి కి ఈ సారి తిరుగులేదని మళ్లీ ప్రజలు ఆయనకే పట్టం కట్టబోతున్నరు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే నిజయితే వైఎస్సార్సీపీ పార్టీ 2009 తరవాత మళ్లీ తన జెండా ను ఎగురవేయడం ఖాయం. కానీ రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారుతాయి అని చెప్పలేం కదా. అందుకే ఫలితాలు వచ్చేదాకా వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: